Cricket: కామన్వెల్త్ క్రీడలకు భారత జట్టు ప్రకటన.. ఏపీ అమ్మాయికి అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామన్వెల్త్ క్రీడల్లో అధికారులు మహిళల క్రికెట్కు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది బర్మింగ్ హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. ఈ క్రీడల్లో టీ20 ఫార్మాట్లో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు మహిళల టీమిండియా జట్టు ఇప్పటికే బర్మింగ్హోమ్ చేరుకుంది. తాజాగా ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది ప్లేయర్స్ లిస్టును సెలక్టర్లు ప్రకటించారు. ఈ జట్టుకు హర్మన్ప్రీత్ కెప్టెన్గా, స్మృతి మంధాన వైస్కెప్టెన్గా వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సబ్బినేని మేఘనకు జట్టులో చోటు దక్కింది.
కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, తానియా, యస్తిక , దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్, మేఘన సింగ్, రేణుక సింగ్, జెమీమా, రాధా యాదవ్, హర్లీన్, స్నేహ్ రాణా.
Also Read
- World Cup 2027: తిలక్ వర్మకు గోల్డెన్ ఛాన్స్.. బీసీసీఐ ప్లాన్ చేసిన టాప్ ఆటగాళ్ల జాబితా ఇదే..
- Vaibhav Sooryavanshi: చరిత్ర తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్గా బాధ్యతలు స్వీకరణ..
- Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
- Fit India Ambassador: గౌతమ్ గంభీర్కు భావోద్వేగ క్షణం.. కుమార్తె ఆజీన్కు అరుదైన గౌరవం
Read Also: ICC WTC: ఆసీస్పై విజయంతో భారత్ స్థానానికి ఎసరు పెట్టిన శ్రీలంక
కామన్వెల్త్ క్రీడల్లో జరిగే క్రికెట్లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్లను రెండు గ్రూపులుగా అధికారులు విభజించారు.గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, బార్బడోస్, పాకిస్థాన్ ఉండగా.. గ్రూప్-బిలో శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. కాగా ఈనెల 29న ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఇటీవల టీ20 ఫార్మాట్లో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్ను భారత అమ్మాయిలు 2-1తో సొంతం చేసుకోవడంతో కామన్వెల్త్ క్రీడల్లో టీమిండియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.

తాజావార్తలు
-
Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
-
Kim Jong Un: కిమ్ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
-
Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
-
Uzbekistan: భారతీయులకు గుడ్న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
-
Nepal Floods: తప్పిన ఘోర విషాదం.. 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన హెడ్మాస్టార్.. క్షణాల్లో మునిగిన స్కూల్
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!