Rohit Sharma: టీమ్ కల్చర్ ముఖ్యం బిగులు.. రోహిత్ను తప్పించిందే దాని కోసం..
- భారత వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించిన బీసీసీఐ..
- మూడు ఫార్మాట్లలో జట్టు బాధ్యతలను శుభ్మన్ గిల్కు అప్పగించేందుకు ప్లాన్..
- టీమ్ కల్చర్ కోసమే వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించాం: బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma: టీమిండియా వన్డే క్రికెట్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను బీసీసీఐ తప్పించింది. భవిష్యత్తును దృష్టి పెట్టుకుని యంగ్ ప్లేయర్ శుభ్మన్ గిల్ను బాధ్యతలు అప్పగించింది. అయితే, దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వచ్చే వన్డే ప్రపంచకప్ వరకూ కొత్త కెప్టెన్ తోనే టీమిండియా బరిలోకి దిగాలనే ఆలోచనతో ఉన్నట్లు టీమ్ మేనేజ్మెంట్ పేర్కొంది. అందుకే రోహిత్ స్థానంలో గిల్ కు అవకాశం కల్పించినట్లు తెలిపింది. రాబోయే రోజుల్లో గిల్కే 3 జట్ల పగ్గాలను అందించేందుకు ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే, టెస్టుల్లో సారథి వ్యవహరిస్తుండగా.. టీ20ల్లోనూ సూర్య కుమార్ యాదవ్కు డిప్యూటీగా బీసీసీఐ ఎంపిక చేసింది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత ఎలాగూ గిల్కే కెప్టెన్సీ వచ్చే అవకాశం ఉంది.
Read Also: Telangana Govt: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట..
Also Read
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
- Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
- Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
అయితే ఆటగాడిగా రోహిత్ శర్మ వేరు. నాయకుడిగా పోషించే రోల్ వేరు.. డ్రెస్సింగ్ రూమ్లో తనదైన ఫిలాసఫీతో జట్టును ముందుండి నడిపిస్తాడు. ఇప్పుడు అతడు కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నాడు. అవి చాలా తక్కువగా జరిగే మ్యాచులు అని చెప్పాలి. దీంతో టీమ్ కల్చర్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి, అన్ని ఫార్మాట్లకు ఒకరే సారథిగా ఉంటే డ్రెస్సింగ్ రూమ్లో మంచి వాతావరణం ఉండే ఛాన్స్ ఉంది. గంభీర్ ప్రధాన కోచ్గా వచ్చిన తర్వాత ఆరు నెలల వరకూ జట్టు వెనక నుంచి నడిపించేవాడు. అయితే, న్యూజిలాండ్తో స్వదేశంలో టెస్టు సిరీస్, ఆస్ట్రేలియాలో ఓటమి తర్వాత గంభీర్ తనదైన వ్యూహాలకు పదును పెట్టాడు. అప్పటి వరకూ టెస్టులు, వన్డేల్లో రోహిత్కే ఎక్కువ ఛాన్స్ ఇచ్చిన గౌతమ్.. జట్టును తన అధీనంలోకి తీసుకున్నాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇక, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పటికే 35 ఏళ్లకు పైబడి ఉన్నారు.. వన్డే ప్రపంచకప్ కు ఇంకో రెండేళ్ల సమయం ఉంది. ఆలోపు వారిద్దరు ఫామ్లోనూ ఉండటం కోసమే గంభీర్ – అజిత్ అగార్కర్ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కసారిగా రోహిత్ ఫామ్తో ఇబ్బంది పడితే అప్పుడు జట్టులో అయోమయ పరిస్థితులు రాకూడదని ఇలా చేశారని బీసీసీఐ ప్రతినిధి ఒకరు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!