Ind Vs Pak: ‘ఎవరితోనైనా ఓడిపోండి కానీ.. పాకిస్తాన్తో మాత్రం’.. వాచ్మెన్ మాటలపై జెమిమా షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే అభిమానుల్లో ఉండే క్రేజ్, ఉత్కంఠ అంతా ఇంతా కాదు. మైదానంలో ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికుల కళ్లన్నీ ఆ మ్యాచ్పైనే ఉంటాయి. ఇప్పుడు మరోసారి అలాంటి హైవోల్టేజ్ పోరుకు సమయం ఆసన్నమైంది. ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభం కానున్న 2026 మహిళా టీ20 ప్రపంచకప్లో భారత్, పాకిస్తాన్ జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. భారత మహిళల జట్టు ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో తన తొలి మ్యాచ్ను పాకిస్తాన్తో ఆడటం విశేషం. బర్మింగ్హామ్లో ఆదివారం జరగబోయే ఈ హై-ప్రెజర్ మ్యాచ్ గురించి భారత స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అనగానే ఆటగాళ్లపై ఉండే ప్రత్యేకమైన ఒత్తిడి గురించి జెమిమా స్పందిస్తూ.. ఈ మ్యాచ్ మిగిలిన మ్యాచ్ల్లాంటిది కాదని, దీనిపై అభిమానులకు ఉండే అంచనాలు, వచ్చే ఒత్తిడి పూర్తిగా భిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు. తాను మొదటిసారి పాకిస్తాన్తో మ్యాచ్ ఆడినప్పుడు, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ డ్రెస్సింగ్ రూమ్లో ఇచ్చిన స్పీచ్ను ఆమె గుర్తుచేసుకున్నారు. ‘భారత్-పాక్ మ్యాచ్ చరిత్ర ఏంటో మనకు తెలుసు, బయట నుంచి ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది, అభిమానుల అంచనాలు ఎలా ఉంటాయో కూడా తెలుసు. కాబట్టి ఆ ఒత్తిడిని మనం కాదనలేం’ అని హర్మన్ప్రీత్ తమకు ధైర్యం చెప్పినట్లు జెమిమా తెలిపారు.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
ఇదే విషయమై జెమిమా ఒక సరదా ఉదాహరణను పంచుకుంటూ.. ‘చివరికి మా బిల్డింగ్ వాచ్మెన్ కూడా నాతో ‘మీరు ఎవరి చేతిలోనైనా ఓడిపోండి కానీ పాకిస్తాన్ చేతిలో మాత్రం ఓడిపోవద్దు’ అని అంటుంటాడు. ప్రజలు క్రికెట్ను, ఈ రెండు దేశాల మధ్య ఉండే పోటీని అంతలా ప్రేమిస్తారు. అందుకే ఆ స్థాయి ఒత్తిడి ఉంటుంది’ అని చెప్పారు.
గతేడాది మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయిందని, అందుకే ఈ టీ20 ప్రపంచకప్లోనూ భారత్ టైటిల్ గెలిచే బలమైన జట్టుగా బరిలోకి దిగుతోందని జెమిమా ధీమా వ్యక్తం చేశారు. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, టోర్నమెంట్లు ఎలా గెలవాలి అనే విషయంపై జట్టులోని ఆటగాళ్లందరికీ ఇప్పుడు పూర్తి అవగాహన, నమ్మకం ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ టోర్నీలో భారత్ గ్రూప్-ఎ లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లతో కలిసి ఉంది. ఈ గ్రూప్ నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి.
తాజావార్తలు
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Dharmendra Pradhan: సోషల్ మీడియా ఖాతాల్లో మార్పు.. కేంద్రమంత్రి హోదా తొలగింపు
-
Abhijeet Dipke: నా కొడుకు కష్టానికి ఫలితం దక్కింది.. అభిజిత్ దీప్కే తల్లి ఆనందం
-
CJP: “ఇది ఫస్ట్ వికెట్ మాత్రమే”.. సీజేపీ సంచలనం.. ప్రధాన్ రాజీనామాతో ఆగదా..?
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!