Suryakumar Yadav: అందుకే బబుల్ గమ్ను ఇంకాస్త గట్టిగా నమిలా: సూర్యకుమార్
- సూర్య హాఫ్ సెంచరీ
- కోహ్లీ ఔట్ అవ్వడం బాధించింది
- 64 మ్యాచుల్లో 15 సార్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav Reacton goes Viral after Virat Kohli Out: టీ20ల్లో టాప్ ర్యాంకర్గా కొనసాగడానికి తనకు పూర్తి అర్హత ఉందని టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి నిరూపించాడు. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో అఫ్గాన్తో జరిగిన మ్యాచ్లో సూర్య (53: 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీ బాదాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఔటైనప్పుడు జట్టుపై ప్రతికూల ప్రభావం పడకుండా.. సూపర్ ఇన్నింగ్స్తో ఆదుకున్నాడు. అయితే కీలక సమయంలో కోహ్లీ ఔట్ అయినపుడు సూరీడు తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఈ సమయంలో బబుల్ గమ్ను ఇంకాస్త గట్టిగా నమిలాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.
మ్యాచ్ అనంతరం బబుల్ గమ్ను ఎందుకు గట్టిగా నమలాల్సి వచ్చిందో సూర్యకుమార్ యాదవ్ వివరించాడు. ‘మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ చేయడాన్ని నేను ఎప్పుడూ ఆస్వాదిస్తా. అందుకు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తాను. ప్రత్యర్థి బౌలర్లు మ్యాచ్పై పట్టు సాధించే సమయం అత్యంత క్లిష్టమైంది. ఆ సమయంలో దూకుడుగా ఆడాలి. అలా ఆడటం నాకిష్టం. ఈ మ్యాచ్లో అదే చేశా. కీలక సమయంలో విరాట్ కోహ్లీ ఔట్ అవ్వడం బాధించింది. ఆ సమయంలో టెన్షన్కు గురికాకుండా ఉండేందుకు బబుల్ గమ్ను ఇంకాస్త గట్టిగా నమిలా. దాంతో మళ్లీ నా ఆటపై దృష్టిపెట్టా’ అని సూర్య చెప్పాడు.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
Also Read: Gold Rate Today: మగువలకు భారీ షాక్.. తులం బంగారంపై రూ.810 పెరిగింది!
‘రోహిత్ శర్మతో కలిసి ఆడాను. అంతేకాదు అతడి నాయకత్వంలో చాలా క్రికెట్ ఆడా. నా ఆట గురించి అంతా తెలుసు. ఏం చేయాలనే దాని గురించి పూర్తి అవగాహనతో ఉన్నా. హార్దిక్ పాండ్యా క్రీజ్లోకి వచ్చినప్పుడు దూకుడైన ఆటనే కొనసాగించాలని భావించాం. 180 స్కోర్ సాధించడం సంతోషంగా అనిపించింది’ అని సూర్యకుమార్ తెలిపాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధికంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను దక్కించుకున్న క్రికెటర్గా సూర్య నిలిచాడు. 64 మ్యాచుల్లో 15 సార్లు అవార్డు విజేతగా నిలిచాడు.
- Tags
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!