T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్లో భారత్ దక్షిణాఫ్రికాను ఓడించి. దక్షిణాఫ్రికాపై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని గెలుచుకుంది. దీంతో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ భారతదేశాన్ని అభినందిస్తూ తన “ఎక్స్” హ్యాండిల్లో తాజా పోస్ట్తో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అతను ఈ పోస్ట్లో వ్రాశాడు.. “ఇది ఏమి ఆట, నేను ఊపిరి పీల్చుకోలేకపోయాను. ఆటను అద్భుతంగా మలిచారు. విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు. ఈ విజయం భారత్కు దక్కింది. దక్షిణాఫ్రికా కూడా మెరుగ్గా ఆడింది. అమేజింగ్.” అంటూ రాసుకొచ్చారు.
READ MORE: Amarnath Yatra : అమర్నాథ్ యాత్రలో తొలిరోజు బాబా బర్ఫానీని దర్శించుకున్న 13 వేల మంది భక్తులు
సుందర్ పిచాయ్ మాత్రమే కాదు.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా భారత్ విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఆయన తన అధికారిక “ఎక్స్” ఖాతాలో భారత్ విజయంపై పోస్ట్ చేశారు. భారత్కు భారీ విజయంపై అభినందనలు తెలిపారు. అతను తన తాజా పోస్ట్లో వ్రాశాడు.. “వాట్ ఏ ఫైనల్.. విజయం సాధించిన భారత్ టీంకు అభినందనలు.. దక్షిణాఫ్రికా కూడా బాగా ఆడింది. ఇది సూపర్ వరల్డ్ కప్. వెస్టిండీస్ మరియు అమెరికాలో మరిన్ని మ్యాచ్ లు ఆడుకుందాం రండి.”