Sanju Samson: టీ20 వరల్డ్కప్లో కెప్టెన్ ముందు సంజు శాంసన్ ఒకే ఒక డిమాండ్..! ఆ సీక్రెట్ను లీక్ చేసిన సూర్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanju Samson: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో విజయభేరి మోగించి.. కప్ను అందుకుంది టీమిండియా.. భారత్ సెమీస్ చేరాల్సిన మ్యాచ్.. ఆ తర్వాత సెమీస్.. ఫైనల్ మ్యాచ్లోనూ సంజు శాంసన్ ఇన్నింగ్స్ మరువలేనివి.. టీమ్ ఇండియాకు తాను ఎంత ముఖ్యమైన ఆటగాడో దీంతో మరోసారి నిరూపించాడు. ICC Men’s T20 World Cup సందర్భంగా అతను జట్టు కోసం చూపిన అంకితభావం గురించి టీమ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు.
కెప్టెన్ ముందు సంజు ఒక్క మాట
టోర్నమెంట్ ప్రారంభంలో జట్టు కాంబినేషన్ల కారణంగా సంజు శాంసన్ ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఆ సమయంలో అతను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను కలిసి ఒకే ఒక మాట చెప్పాడట. “జట్టుకు నేను ఏమి చేయగలను చెప్పండి” అని సంజు అడిగాడని సూర్య వెల్లడించాడు. ఒక ఆటగాడి నుంచి ఇలాంటి జట్టు కోసం ఆలోచించే వైఖరి రావడం టీమ్కు పెద్ద బలం అని సూర్య తెలిపారు.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
బెంచ్ ప్లేయర్లను మేనేజ్ చేయడం కష్టం
ప్రపంచ కప్ సమయంలో కెప్టెన్గా తనకు అత్యంత కష్టమైన పని ప్రతి మ్యాచ్లో ఆడే అవకాశం రాని ఆటగాళ్లను మానసికంగా సిద్ధంగా ఉంచడం అని సూర్య చెప్పారు. ఎప్పుడైనా అవకాశం వస్తే సిద్ధంగా ఉండటం వారికి సవాల్గా ఉంటుందని పేర్కొన్నారు. అందుకే వారితో ఎక్కువ సమయం గడిపి మాట్లాడటం అవసరం అవుతుందని తెలిపారు. మరోవైపు.. టోర్నమెంట్ ప్రారంభంలో అవకాశాలు రాకపోయినా, నాకౌట్ దశలో సంజు శాంసన్కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆ అవకాశాన్ని అతను అద్భుతంగా వినియోగించుకున్నాడు. వెస్టిండీస్పై సూపర్ 8 మ్యాచ్లో అజేయంగా 97 పరుగులు.. సెమీఫైనల్లో 89 పరుగులు.. ఫైనల్లో కూడా 89 పరుగులు.. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్లతో భారత జట్టు టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు సంజు శాంసన్..
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్
కేవలం ఐదు ఇన్నింగ్స్లలోనే సంజు శాంసన్ 321 పరుగులు చేసి టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా నిలిచాడు. అతని అద్భుతమైన ప్రదర్శనను గుర్తించి అతనికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా లభించింది. అయితే, వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయమే ముఖ్యమని సంజు శాంసన్ చెప్పడం అతని టీమ్ స్పిరిట్ను మరోసారి చూపించింది.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!