T20 World Cup 2026: గుడ్న్యూస్.. రింకు సింగ్ ఈజ్ బ్యాక్.. !
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8 దశలో ఉన్న టీమ్ ఇండియాకు భారీ ఊరట లభించింది. వ్యక్తిగత కారణాలతో స్వల్ప విరామం తీసుకున్న స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ (Rinku Singh) తిరిగి జట్టుతో చేరనున్నారు. గురువారం (ఫిబ్రవరి 26) జింబాబ్వేతో జరగనున్న కీలక పోరుకు ముందు అతను జట్టులోకి రావడం భారత శిబిరంలో ఉత్సాహాన్ని నింపింది. అయితే, రింకూ సింగ్ తండ్రి ఖంచంద్ సింగ్ తీవ్ర అనారోగ్యం పాలవ్వడంతో, కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా రింకూ.. మంగళవారం జట్టును వీడి ఇంటికి వెళ్లారు. దీనితో జింబాబ్వేతో జరిగే మ్యాచ్లో అతను ఆడటంపై సందిగ్ధత నెలకొంది. అయితే, తాజా సమాచారం ప్రకారం అతని తండ్రి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉండటంతో, రింకూ తిరిగి జాతీయ విధుల్లో చేరాలని నిర్ణయించుకున్నాడు.
భారత బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్ (Sitanshu Kotak) బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో రింకూ సింగ్ తిరిగి జట్టులో చేరడాన్ని ధృవీకరించారు. “రింకూ సింగ్ బుధవారం (ఫిబ్రవరి 25) సాయంత్రం కల్లా తిరిగి జట్టులో చేరుతాడు. అతని తండ్రి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఇది పూర్తిగా వ్యక్తిగత విషయం. అతను తిరిగి రావడంతో జట్టులో తుది ఎంపికకు మరిన్ని అవకాశాలు మెరుగుపడతాయి,” అని కోటక్ పేర్కొన్నారు.
Also Read
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్మన్ గిల్ పోస్ట్పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్దీప్ సింగ్ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
- Sanju Samson: టీ20 వరల్డ్కప్లో కెప్టెన్ ముందు సంజు శాంసన్ ఒకే ఒక డిమాండ్..! ఆ సీక్రెట్ను లీక్ చేసిన సూర్య..
వరల్డ్ కప్లో రింకూ ప్రదర్శన
ప్రస్తుత ప్రపంచకప్లో రింకూ ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. గత ఐదు ఇన్నింగ్స్ల్లో అతను కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన గత మ్యాచ్లో డకౌట్ అయినప్పటికీ, డెత్ ఓవర్లలో అతని హిట్టింగ్ సామర్థ్యంపై యాజమాన్యం పూర్తి నమ్మకంతో ఉంది. ఈ టోర్నీలో USA: 6 పరుగులు, నమీబియా: 1 పరుగు, పాకిస్తాన్: 11 పరుగులు, నెదర్లాండ్స్: 6 పరుగులు చేసిన రింకూ సింగ్.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో డకౌట్ అయ్యాడు..
జింబాబ్వేపై తిరుగులేని రికార్డు
గతంలో జింబాబ్వేపై రింకూ సింగ్ ఆడిన రికార్డులు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా హరారే వేదికగా జరిగిన మ్యాచ్లో అతను చేసిన 48 నాటౌట్ ఇన్నింగ్స్ జట్టును ఆదుకుంది. రేపటి మ్యాచ్ చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జరగనుండటంతో, స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కోగల రింకూ ఉనికి జట్టుకు కీలకం కానుంది. భారత్ ఈ మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తేనే సెమీఫైనల్ రేసులో తమ అవకాశాలను మెరుగుపరుచుకుంటుంది. ఈ నేపథ్యంలో రింకూ ‘మిడాస్ టచ్’ తిరిగి కనిపిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!