Indian Cricket Team: పాకిస్థాన్ ‘డాన్’ పత్రిక మొదటి పేజీలో టీమిండియా ఫొటో!
- ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరైన దక్షిణాఫ్రికా
- కీలక మ్యాచ్లో కోహ్లీ ఆదుకున్నాడు
- టీమిండియా విజయోత్సాహాల ఫొటో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Cricket Team Photo on Dawn’s front page: టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ను టీమిండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కింగ్స్టన్ ఓవల్ మైదానంలో దక్షిణాఫ్రికాతో నువ్వానేనా అన్నట్లు సాగిన ఫైనల్ సమరంలో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచి.. పొట్టి ప్రపంచకప్ను రెండోసారి కైవసం చేసుకుంది. టైటిల్ సొంతం చేసుకున్న భారత క్రికెట్ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత్ మీడియానే కాకుండా అంతర్జాతీయ మీడియా కూడా భారత క్రికెట్ జట్టుపై ప్రశంసల వర్షం కురిపించింది.
‘గేరు మార్చి భారత్కు కప్పు అందించిన విరాట్ కోహ్లీ’ అంటూ లండన్కు చెందిన సండే టైమ్స్ తమ కథనంలో పేర్కొంది. నాకౌట్ మ్యాచ్లలో ఒత్తిడిని అధిగమించలేని దక్షిణాఫ్రికా.. మరోసారి అదే ధోరణిని కొనసాగించిందని రాసుకొచ్చింది. ‘ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరైన దక్షిణాఫ్రికా.. భారత్కు కప్పు అందజేసింది’ అంటూ బ్రిటీష్ డైలీ బ్రాడ్షీట్ వార్తాపత్రిక టెలిగ్రాఫ్ పేర్కొంది. ‘టోర్నమెంట్ ఆసాంతం ఇబ్బందిపడినప్పటికీ.. కీలక మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు’ అని ఆస్ట్రేలియాకు చెందిన ఫాక్స్ క్రికెట్ విశ్లేషించింది.
Also Read
- T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్మన్ గిల్ పోస్ట్పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్దీప్ సింగ్ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
Also Read: Kalki 2898 AD Collections: ‘బాహుబలి’ రికార్డు బ్రేక్ చేసిన ‘కల్కి 2898 ఏడీ’!
ఇక దాయాది పాకిస్థాన్కు చెందిన ‘డాన్’ పత్రిక భారత జట్టుపై ప్రశంసలు కురిపించింది. విరాట్ కోహ్లీ ఆటతీరును ప్రత్యేకంగా కొనియాడింది. టీమిండియా విజయోత్సాహాలకు సంబంధించిన ఫొటోను మొదటి పేజీలో ప్రచురించింది. దాంతో భారత ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే పాకిస్థాన్ మీడియా టీమిండియాను కొనియాడుతూ కథనాలు ప్రచురించగా.. ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ మాత్రం ప్రపంచకప్ విజయాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేసింది. భారత జట్టుకు అన్నీ అనుకూలించాయని, అంపైర్ల నిర్ణయాలతో ఎట్టకేలకు టీమిండియా కప్పు గెలిచిందని పేర్కొంది. సూపర్-8 మ్యాచ్లో ఆస్ట్రేలియాపై భారత్ గెలవడాన్ని జీర్ణించుకోలేకే ఇలా అక్కసు వెళ్లగక్కిందని క్రీడానిపుణులు అంటున్నారు.
తాజావార్తలు
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
-
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
-
Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్’లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Chiru – Bobby Movie: ‘చిరు 158’లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ‘జైలర్’ డీవోపీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..