IND vs ENG : వర్షం పడి సెమీస్ మ్యాచ్ రద్దైతే..? టీమిండియా నేరుగా..
- టి20 ప్రపంచ కప్ సెమిస్ లో ఇంగ్లాండ్ తో తలబడనున్న టీమిండియా.
- జూన్ 27 గురువారం నాడు గయానలో మ్యాచ్.
- భారీ వర్షం పడుతుందంటున్న వాతావరణం శాఖ.
- అదే జరుగుతే నేరుగా ఫైనల్ లో టీమిండియా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో టీమిండియా వరుస విజయాలతో సెమీఫైనల్ లో స్థానాన్ని సంపాదించింది. సెమీఫైనల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తో టీమిండియా తలపడనుంది. జూలై 27 గురువారం నాడు గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరుగుతుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితులు మ్యాచులకు అనుకూలించట్లేదు. ఎప్పుడు వర్షం పడుతుందా.. ఎప్పుడు మ్యాచ్ నిలిచిపోతుందా.. అంటూ క్రికెట్ అభిమానులు ఆందోళన పడిపోతున్నారు. ఇకపోతే సెమీఫైనల్స్ లో వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే ఏ టీం ఫైనల్ కు చేరుతుందన్న విషయం గురించి చూస్తే..
Hanuma Vihari: హనుమ విహారికి లోకేష్ మద్దతు.. తిరిగి ఏసీఏ తరపున ఆడాలని నిర్ణయం
Also Read
- Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- T20 World Cup: కేవలం భారత్, పాకిస్థాన్ మ్యాచ్కే హైప్ తెస్తారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్మృతి మంధాన..
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ లో ఇదివరకే చాలా మ్యాచ్లకు వర్షం అడ్డంకిగా మారింది. దాంతో ప్రపంచ కప్ లో కొన్ని మ్యాచ్లు రద్దు కావడంతో మరికొన్ని మ్యాచ్ లలో ఓవర్లు కుదించి మ్యాచ్ను ఆడించారు. ఇకపోతే టీమిండియా క్రికెట్ అభిమానుల్లో దృష్టి ఇప్పుడు అంతా గయానాలోని వాతావరణం పై పడింది. గురువారం నాడు జరిగే మ్యాచ్లో ఒకవేళ వర్షం పడితే.. టీమిండియా పరిస్థితి ఏంటో అంటూ కంగారు పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారుల ప్రకారం గురువారంనాడు గయానాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సమాచారం. దాదాపు 90 శాతం దగ్గరగా వర్షం పడే అవకాశం ఉందని., అందులో కూడా కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్లు అధికారులు సూచించారు. అయితే సెమి ఫైనల్ మ్యాచ్లకు ఐసీసీ రిజర్వ్ డేను ఇవ్వలేదు.
INDIA Bloc: సాయంత్రం ఖర్గే ఇంట్లో ఇండియా కూటమి నేతల భేటీ.. స్పీకర్ ఎన్నికపై చర్చ
ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ జరగకపోతే నాలుగు గంటల పది నిమిషాలు అదనపు సమయాన్ని కేటాయిస్తారు. ఆ సమయంలో కూడా మ్యాచ్ జరగలేదంటే రద్దు చేసేస్తారు. ఒకవేళ ఇదే జరిగితే ఐసీసీ నిబంధనల ప్రకారం సెమీఫైనల్ కు చేరుకున్న రెండు జట్లలో సూపర్ 8 స్టేజిలో ఎవరైతే మెరుగు ప్రదర్శన చేసి ఉంటారో.. ఆ జుట్టు నేరుగా ఫైనల్ గా చేరుకుంటుంది. దీంతో సూపర్ 8 దశలో ఇంగ్లాండ్ కంటే టీమిండియా మెరుగు ప్రదర్శన చేసింది. కాబట్టి ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయిన టీమిండియా నేరుగా ఫైనల్ లో చోటు సంపాదించుకుంటుంది. కాబట్టి భారత అభిమానులు వర్షం పడుతుందని బాధపడాల్సిన అవసరం లేదు. నిజానకి ఈ విషయం తెలిసిన చాలామంది ఖచ్చితంగా వర్షం కులవాలని కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్లకు గట్టి పోటీ
-
Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
-
Sai Durgha Tej : సాయి దుర్గ తేజ్ నెక్ట్స్ సినిమా టైటిల్ ‘పార్వేట’
-
India U18 Hockey Asia Cup Champion: జపాన్పై ఘన విజయం.. అండర్-18 హాకీ ఆసియా కప్ ఛాంపియన్గా భారత్
-
Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!