T20 Worldcup 2022: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఐనాక్స్లో టీ20 ప్రపంచకప్ మ్యాచ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 Worldcup 2022: ఈనెల 23 నుంచి ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. భారత్ తన తొలి మ్యాచ్ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో ఆడనుంది. ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే అన్ని పనులు ఆపుకుని మరీ టీవీల ముందు అతుక్కుపోతుంటాం. మరి అలాంటి మ్యాచ్ థియేటర్లలో వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ను థియేటర్లలో చూసే అవకాశాన్ని మల్టీప్లెక్సులు కల్పించబోతున్నాయి. ఈ మేరకు ఐసీసీతో ఐనాక్స్ సంస్థ ఒప్పందం చేసుకుంది. టీ20 ప్రపంచకప్లో భారత్ ఆడే మ్యాచ్లను దేశవ్యాప్తంగా 25కు పైగా నగరాల్లో ఐనాక్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. మ్యాచ్లను థియేటర్లో పెద్ద స్క్రీన్పై చూస్తే క్రికెట్ మైదానంలో లైవ్గా మ్యాచ్లను చూస్తున్న అనుభూతి కలుగుతుందని ఐనాక్స్ సంస్థ చెబుతోంది. దేశ వ్యాప్తంగా మొత్తం 70 నగరాల్లో దాదాపు వెయ్యి స్క్రీన్ల వరకు ఐనాక్స్ నిర్వహణలో ఉన్నాయి.
Read Also: BCCI: బీసీసీఐ నుంచి గంగూలీ అవుట్.. ఐపీఎల్ ఛైర్మన్ పదవినీ తిరస్కరించిన దాదా
Also Read
- KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
- MS Dhoni: బిగ్ అప్డేట్.. సన్రైజర్స్తో మ్యాచ్కి ధోనీ ఎంట్రీ..
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
ఐనాక్స్లో మ్యాచ్ చూడాలనుకుంటే రూ.200 నుంచి రూ.500 వరకు టిక్కెట్ ధర ఉంటుందని తెలుస్తోంది. కాగా టీ20 వరల్డ్ కప్లో ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో జట్లు ప్రాక్టీస్ కోసం వార్మప్ మ్యాచ్లు ఆడనున్నాయి. టీమిండియా ఈనెల 17, 18 తేదీల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో మ్యాచ్లు ఆడనుంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఉదయం 8:30 గంటలకు, న్యూజిలాండ్తో మ్యాచ్ మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లైవ్ టెలికాస్ట్ చేయనుంది. క్రికెట్ అభిమానులు ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్థాన్ వార్మప్ మ్యాచ్లను కూడా టీవీలో లైవ్గా వీక్షించవచ్చు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..