Site icon NTV Telugu

భారత అండర్-19 జట్టుకు రోహిత్ క్లాస్…

భారత అండర్-19 జట్టుకు రోహిత్ శర్మ నేషనల్ క్రికెట్ అకాడమీలో క్లాస్ తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం భారత జట్టు మొత్తం మూడు టెస్టుల సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికా పర్యటన వెళ్లిన విషయం తెలిసిందే. కానీ అక్కడికి వెళ్ళడానికి ముందు ముంబైలో జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో రోహిత్ గాయం బారిన పడ్డారు. దాంతో ఈ సిరీస్ కు వైస్ కెప్టెన్ గా ఎంపికైన రోహిత్ పూర్తి సిరీస్ కు దూరం అయ్యాడు. ఇక ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో గాయానికి చికిత్స తీసుకుంటున్న రోహిత్ అక్కడికి వచ్చిన యువ ఆటగాళ్లకు తన అనుభవాన్ని పంచాడు.

అయితే వచ్చే ఏడాది వెస్టిండీస్ వేదికగా అండర్-19 ప్రపంచ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన యువ జట్టు ప్రస్తుతం ఎన్సీఏ లో శిక్షణ పొందుతుంది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన రోహిత్ వారికి ఆటకు సంభందించిన కీలక సూచనలు చేసాడు. దీనికి సంభంధించితిన్ ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్ లో పంచుకుంది.

Exit mobile version