యూపీ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై….సైనా నెహ్వాల్ చేసిన ట్వీట్పై విమర్శలు వెల్లవెత్తున్నాయి. సైనా ట్వీట్కు స్పందించిన RLD అధ్యక్షుడు జయంత్ చౌదరి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ధ్వంసం చేయడాన్ని సర్కారీ షెట్లరు గుర్తించారని కామెంట్ చేశారు. ప్రజల నిర్ణయాలను ప్రభావితం చేసేందుకు సెలబ్రిటీలు ప్రయత్నిస్తుండటంపై ఓటర్లు ‘డ్రాప్ షాట్’ ప్రయోగించాల్సిన అవసరం ఉందని జయంత్ చౌదరి అభిప్రాయపడ్డారు. అయితే యూపీ పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలవటంతో….ఆ పార్టీ తరుపున గెలిచిన జిల్లా పరిషత్ చైర్మన్లకు అభినందనలు అంటూ ట్వీట్ చేసింది సైనా నెహ్వాల్