ఐపీఎల్ సీజన్ 2022లో జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. అయితే.. నేడు ముంబాయిలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా.. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు పంజాబ్ కింగ్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. అయితే.. పంజాబ్ కింగ్స్ తుది జట్టులో ఫాస్ట్ బౌలర్ సందీప్ శర్మ స్థానంలో స్పిన్నర్ హర్ప్రీత్ బరార్ జట్టులోకి తీసుకుంటున్నట్లు మార్పు చేసినట్లు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తెలిపారు. ఈ సీజన్లో ఇప్పటికే 12 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ జట్టు 7 మ్యాచుల్లో విజయం సాధించి.. 14 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.
అయితే.. ఆర్సీబీ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సిందే. ఇకపోతే.. పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్లాడి కేవలం 5 మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించారు. ఈ జట్టు కూడా ప్లేఆఫ్స్ రేసులో నిలవాంటే ఈ రోజు మ్యాచ్ కీలకమనే చెప్పాలని.. అయితే రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకమైన క్రమంలో ఎవరు గెలుస్తారోనని మరింత ఆసక్తి పెరిగింది.