Rajasthan Royals Captain: రాజస్థాన్ రాయల్స్లో కెప్టెన్సీ హీట్.. ఆర్ఆర్ పోస్ట్ వైరల్!
- రాజస్థాన్ రాయల్స్లో కెప్టెన్సీ హీట్
- రేసులో జైస్వాల్, పరాగ్ పేర్లు
- రాయల్స్ కెప్టెన్గా రవీంద్ర జడేజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్కు ముందే రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) శిబిరంలో కెప్టెన్సీ అంశం హాట్ టాపిక్గా మారింది. మాజీ కెప్టెన్ సంజూ శాంసన్ అనంతరం నాయకత్వ బాధ్యతలు ఎవరు చేపడతారనే దానిపై అటు అభిమానుల్లోనూ, ఇటు క్రికెట్ వర్గాల్లోనూ జోరుగా చర్చ జరుగుతోంది. యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ పేర్లు ముందుకొస్తున్నప్పటికీ.. సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజానే తదుపరి కెప్టెన్గా ఉండాలంటూ పలువురు మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ అంటున్నారు. ఈ స్పెక్యులేషన్ల మధ్య రాజస్థాన్ తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్టు ఒకటి అభిమానుల్లో మరోసారి ఉత్కంఠను పెంచింది.
రాజస్థాన్ రాయల్స్ తన ఎక్స్లో రవీంద్ర జడేజా ఫొటోను పంచుకును.. ‘దళపతి’ అనే కాప్షన్ ఇచ్చింది. దాంతో రాయల్స్ను నడిపించేది జడేజానే అని ఖాయమైంది. చెన్నై సూపర్ కింగ్స్తో ట్రేడ్ డీల్లో భాగంగా జడేజా రాయల్స్లో చేరిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 ఆవరకు రాజస్థాన్కు కెప్టెన్గా ఉన్న సంజు శాంసన్ చెన్నైకి వెళ్లిపోయాడు. జడేజా 2008–09 మధ్యలో రాజస్థాన్ తరఫున ఆడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆ ఫ్రాంచైజీలోకి రావడమే కాదు.. కెప్టెన్సీ కూడా దక్కించుకున్నాడు.
Also Read
- Womens T20 World Cup: పాకిస్థాన్పై కొట్టడం అంటే ఆ మజానే వేరు.. ఫామ్లోకి వచ్చిన రిచా ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: సూపర్ ఓవర్ వివాదం తర్వాత వైభవ్కు మరో అవకాశం.. మళ్లీ బేబీ బాస్పైనే అందరి కళ్లు..!
- Vaibhav Sooryavanshi: వైభవ్తో గొడవకు దిగిన ఆటగాడి తిక్క కుదిర్చిన శ్రీలంక బోర్డు.. సూర్యవంశీతో పెట్టుకుంటే అంతే మరి..
- T20 World Cup: పాక్పై గెలిచినా తగ్గని కసి.. డచ్ జట్టుపై భారీ విజయమే లక్ష్యంగా బరిలోకి టీమిండియా..
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ హోం మ్యాచ్ల వేదిక విషయంలోనూ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) స్టేడియం రాయల్స్ హోం గ్రౌండ్గా మారే అవకాశాలు ఉన్నాయి. గత నవంబర్లో ఐఏఎన్ఎస్ కథనం ప్రకారం.. రాయల్స్తో పాటు డిఫెండింగ్ చాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా పుణె వేదికపై ఆసక్తి చూపాయి. అయితే తాజా పరిణామాల ప్రకారం పుణె హోం వెన్యూ దాదాపుగా రాయల్స్కే దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ యాజమాన్యం స్టేడియం తనిఖీలు, సమీప సదుపాయాలపై ప్రాథమిక పరిశీలన కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సంస్థాగత కారణాల వల్లే రాయల్స్ తమ ప్రధాన హోం గ్రౌండ్ అయిన జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం నుంచి కొన్ని మ్యాచ్లను బయట వేదికలకు తరలించాల్సి వస్తోంది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్తో నెలకొన్న వివాదాలు ఇందుకు ప్రధాన కారణం.
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?