NTV Telugu Site icon

టీ20 ప్రపంచ కప్ : పాక్ కోచ్ గా మాథ్యూ హేడెన్

వచ్చే నెల 17 నుండి యూఏఈ వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచ కప్ దగ్గరకు వస్తుండటంతో దాదాపు అన్ని క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. ఇక ఏ మధ్యే పాకిస్థాన్ కూడా ఈ టీ20 వరల్డ్ కప్ కు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. కానీ అదే సమయంలో ఆ జట్టు హెడ్ కోచ్‌ అయిన మిస్బా ఉల్ హక్, బౌలింగ్ కోచ్‌ అయిన వకార్ యూనిస్ తమ బాధ్యతల నుండి తప్పుకున్నారు. దాంతో పాక్ బోర్డు ఆలోచనలో పడింది. ఇక తాజాగా పాక్ బోర్డు జట్టు హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ మాథ్యూ హెడెన్, బౌలింగ్ కోచ్‌గా వెర్నన్ ఫిలండర్‌ను నియమించారు. అయితే హెడెన్ రాకతో జట్టులో ఉత్సహం పెరుగుతుందని బోర్డు భావిస్తుంది. ఇక బాబర్ ఆజమ్ సారథ్యంలో పాక్ జట్టు ఈ టోర్నీలో పాల్గొంటున్న విషయం తెలిసిందే.

పాకిస్థాన్ జట్టు : బాబర్ ఆజమ్ (c), షాదాబ్ ఖాన్ (vc), ఆసిఫ్ అలీ, అజామ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మహ్మద్ హఫీజ్, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (wk), మొహమ్మద్ వసీం, షాహీన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్.