Lakshya Sen In Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ తీవ్ర నిరాశ పరిచాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్లో విభాగంలో సెమీ ఫైనల్స్లో ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్, డెన్మార్క్ ఆటగాడు విక్టర్ అక్సెల్సెన్ చేతిలో ఓటమిని చవిచూశాడు. దీంతో కాంస్య పతకం కోసం లక్ష్యసేన్ మరో మ్యాచ్ ఆడనున్నారు. మ్యాచ్ ప్రారంభంలో లక్ష్యసేన్ అద్భుతంగా రాణిస్తూ.. డెన్మార్క్ ప్లేయర్పై ఒక దశలో లక్ష్యసేన్ అధిపత్యం కనబర్చాడు.
Read Also: Intimate Relationship: త్యాగమూర్తివయ్యా.. భార్యకు లవర్తో పెళ్లి జరిపించిన భర్త..
అయితే, స్కోర్ 18- 13 ఉండగా.. తొలిసెట్ను లక్ష్యసేన్ గెలుచుకుంటాడని అందరు అనుకున్నారు.. కానీ అనుహ్యాంగా డెన్మార్క్ ప్లేయర్ విక్టర్ అక్సెల్సెన్ చివరి దశలో పుంజుకుని 22- 20 తేడాతో మొదటి సెట్లో విజయం సాధించాడు. ఇక, రెండో సెట్లో లక్ష్యసేన్ తొలి పాయింట్లను గెలుచుకోగా.. 7-0తో ఉండగా విక్టర్ అక్సెల్సెన్ ఒక్కసారిగా పుంజుకుని స్కోర్ను 8- 8 సమం చేశాడు. ఆ తర్వాత ఆఫ్ సెట్ పూర్తయ్యే టైమ్ కి ఇద్దరి స్కోర్ 11-11తో ఉంది. చివరిగా రెండో సెట్ను 21- 14 తేడాతో డెన్మార్క్ ప్లేయర్ అక్సెల్సెన్ గెలుచుకుని ఫైనల్స్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కాగా, లక్ష్యసేన్ రేపు కాంస్య పతకం కోసం మలేషియా ఆటగాడు లీజీ జియాతో తలపడనున్నాడు.