KKR vs MI : ముంబై ఇండియన్స్ చారిత్రాత్మక విజయం.. 14 ఏళ్ల నిరీక్షణకు తెర.!
- 14 ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్ గెలుపు
- 221 టార్గెట్ ఛేజ్ చేసిన ముంబై
- రికెల్టన్ అద్భుత ఇన్నింగ్స్
- చివరి ఓవర్లో థ్రిల్ విక్టరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KKR vs MI : ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ చరిత్రలో ఒక అసాధారణమైన రికార్డును తిరగరాస్తూ, దశాబ్ద కాలానికి పైగా తమను వెంటాడుతున్న ‘తొలి మ్యాచ్ ఓటమి’ శాపాన్ని ఎట్టకేలకు చెరిపివేసింది. 2012 సంవత్సరం తర్వాత ముంబై జట్టు తాము ఆడిన మొదటి మ్యాచ్లోనే విజయం సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. కోల్కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ అత్యంత చాకచక్యంగా ఛేదించి, తమ ఐపీఎల్ ప్రస్థానంలోనే అత్యుత్తమ రన్ ఛేజ్ను నమోదు చేసింది. ఈ మ్యాచ్లో ముంబై విజయం దాదాపు ఏకపక్షంగా సాగినట్లు అనిపించినప్పటికీ, చివరి ఓవర్ వరకు ఉత్కంఠను రేకెత్తించింది. ముఖ్యంగా రోహిత్ శర్మ , ర్యాన్ రికెల్టన్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
Padi Kaushik Reddy : కాంగ్రెస్ వ్యూహం లో పడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..?
Also Read
- PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
- PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
- ICC ODI Rankings: టీమిండియా 'వన్డే' జైత్రయాత్ర.. ప్రపంచ ఛాంపియన్లనే వెనక్కి నెట్టి అగ్రస్థానంలో భారత్!
- Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ అజింక్య రహానే 67 పరుగులతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడగా, యువ సంచలనం అంగక్రిష్ రఘువంశీ 51 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టి కేకేఆర్ స్కోరును కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. అయితే, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రహానే గాయపడటంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది, అతని స్థానంలో రింకు సింగ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం గమనార్హం.
Pakistan: పరువు పాయే.. కాలు జారిన పాకిస్తాన్ ఉప ప్రధాని.. వీడియో వైరల్..
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఓపెనర్లు రోహిత్ శర్మ , ర్యాన్ రికెల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. రోహిత్ శర్మ కేవలం 38 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలింగ్ యూనిట్ను చిన్నాభిన్నం చేశాడు. అతనికి తోడుగా ర్యాన్ రికెల్టన్ 43 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 81 పరుగులు చేసి వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి మెరుపు దాడితో ముంబై విజయం దాదాపు ఏకపక్షంగా మారుతున్న తరుణంలో రోహిత్ శర్మ వైభవ్ అరోరా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (16), తిలక్ వర్మ (20) వేగంగా ఆడి స్కోరును విజయానికి దగ్గర చేశారు. చివరి ఓవర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 11 బంతుల్లో 18 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలుపు ముంగిట నిలిపాడు. 19వ ఓవర్ చివరి బంతికి పాండ్యా ఫోర్ కొట్టి స్కోర్లు సమం చేయగా, చివరి ఓవర్ మొదటి బంతికే నమన్ ధీర్ ఫోర్ బాది 19.1 ఓవర్లలోనే 224 పరుగులతో ముంబైకి 6 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ 14 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈ సీజన్ను ఘనంగా ప్రారంభించింది.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?