Rassie Vander Dussen: క్యాచ్ మిస్సయ్యింది.. ఫలితం మారింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ ఓటమిపాలైంది. టీమ్ఇండియాపై దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది. తొలి టీ20 మ్యాచ్ లో భారత్ పై దక్షిణాఫ్రికా ఏ మాత్రం ఒత్తిడి లేకుండా సునాయాసంగా గెలిచేసింది. దక్షిణాఫ్రికా విజయంలో ప్రధానంగా మిల్లర్, రస్సీ వాండర్ డుసెన్ గురించి చెప్పుకోవాలి. వీరిద్దరూ క్రీజులో కుదురుకుని మరో వికెట్ పడకుండా.. వచ్చిన ప్రతీ బంతిని చీల్చి చెండాడారు. డుసెన్ 46 బంతుల్లో 75 పరుగులు చేయగా, డేవిడ్ మిల్లర్ 31 బంతుల్లో 64 పరుగులు రాబట్టుకున్నాడు.
Also Read
- Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
- Ajinkya Rahane: రూమ్కు రూల్.. ఎంఎస్ ధోనీ తలుపు మూసి ఉంటే అంతే..!
- Jos Buttler: "నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం".. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
నిజానికి డుసెన్ ముందే అవుట్ అవ్వాల్సింది. కానీ, అతడు ఇచ్చిన క్యాచ్ను శ్రేయస్ అయ్యర్ పట్టుకోలేకపోయాడు. చేతి నుంచి జారి పడిపోయింది. దీనికి భారత్ జట్టు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. భారత్ మూల్యం చెల్లించుకున్నట్టు స్వయంగా డుసెన్ కూడా వ్యాఖ్యానించాడు. డుసెన్ మొదటి 30 బంతులకు చేసిన పరుగులు కేవలం 29. ఇక ఆ తర్వాత మొదలైంది బ్యాటుతో ఊచకోత. తదుపరి 16 బంతుల్లో అతడు 46 పరుగులు (4 సిక్స్లు, 5 ఫోర్లు) చేశాడంటే ఏ పాటి విధ్వంసమో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి మ్యాచ్ ను దక్షిణాఫ్రికా వైపు తిప్పాడు. డుసెన్ 29 స్కోరుతో ఉన్న సమయంలో 16వ ఓవర్లో అతడు కొట్టిన షాట్ను శ్రేయస్ అయ్యర్ జారవిడిచాడు.
తాజావార్తలు
-
Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..
-
Chiranjeevi: ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవి.. అసలు నిజం ఇదే!
-
UP: అసెంబ్లీలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూత
-
Star Kids: ‘శ్రీనివాస మంగాపురం’ బాక్సాఫీస్ రిజల్ట్ స్టార్ వారసులకు హెచ్చరికేనా?
-
Polavaram-Banakacherla: పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్కు కేంద్రం బ్రేక్.. ప్రతిపాదన వెనక్కి
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!