Rajasthan Royals Owner: రాజస్థాన్ రాయల్స్ కొత్త ఓనర్గా బిలియనీర్ లక్ష్మీ మిట్టల్.. రూ.15,660 కోట్లతో డీల్!
- వ్యాక్సిన్ కింగ్ నుంచి స్టీల్ కింగ్ చేతికి ఆర్ఆర్ జట్టు
- ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కొత్త శకం
- ఇక రాజస్థాన్ రాయల్స్ స్టీల్ కింగ్ సొంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan Royals Owner: ఐపీఎల్ 2026 సీజన్ ఉత్సాహంగా సాగుతున్న సమయంలో, ఒక భారీ బిజినెస్ డీల్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ యాజమాన్య హక్కుల్లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కొత్త బాస్ వచ్చారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్టీల్ దిగ్గజం, భారత సంతతి బిలియనీర్ లక్ష్మీ మిట్టల్ కుటుంబం ఈ జట్టును కొనుగోలు చేసింది. సుమారు 1.65 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 15,660 కోట్లు) భారీ వ్యయంతో ఈ ఒప్పందం కుదిరింది.
ఒప్పందం వివరాలు ఇవే..
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ, వ్యాక్సిన్ కింగ్ అదర్ పూనావాలా నుంచి మిట్టల్ కుటుంబం ఈ జట్టులోని మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. రాజస్థాన్ రాయల్స్లో 75% మెజారిటీ వాటాను మిట్టల్ కుటుంబం దక్కించుకుంది. ఇదే సమయంలో అదర్ పూనావాలా ఈ జట్టులో సుమారు 18% వాటాను తన వద్దే ఉంచుకోనున్నారు. మిగిలిన వాటా ఇతర ఇన్వెస్టర్ల వద్ద ఉంటుంది. మనోజ్ బాడ్లే నేతృత్వంలోని ఎమర్జింగ్ మీడియా గ్రూప్ నుంచి ఈ నియంత్రణ వాటాను కొనుగోలు చేసేందుకు బిసిసిఐ, ఇతర నియంత్రణ సంస్థల ఆమోదం లభించాల్సి ఉంది. 2026 మూడవ త్రైమాసికం నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది.
Also Read
- Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీ చెలరేగుతాడా?.. షమీ, పృథ్వీ, సర్ఫరాజ్లకు కీలక పరీక్ష..
- Gautam Gambhir: సారాంశ్ జైన్కు ఛాన్స్..? కుల్దీప్ యాదవ్పై గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్
- Gautam Gambhir: లైక్స్, వ్యూస్ కాదు.. ట్రోఫీలే ముఖ్యం.. విమర్శకులకు గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్
- AUS vs BAN: కన్నెర్ర చేసిన మిచెల్ స్టార్క్.. 64 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్..!
సొంత గడ్డపై మమకారమే కారణం
ఈ భారీ ఇన్వెస్ట్మెంట్ గురించి లక్ష్మీ మిట్టల్ స్పందిస్తూ భావోద్వేగంగా మాట్లాడారు. “నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. మా కుటుంబం రాజస్థాన్కు చెందినది, అందుకే నేను రాజస్థాన్ రాయల్స్ జట్టులో భాగం కావాలని కోరుకున్నాను. ఈ అద్భుతమైన జట్టు వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎదురుచూస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం తర్వాత రాజస్థాన్ రాయల్స్ బోర్డులో కీలక మార్పులు జరగనున్నాయి. లక్ష్మీ మిట్టల్, ఆదిత్య మిట్టల్ (కుమారుడు), వనిషా మిట్టల్-భాటియా (కుమార్తె), అదర్ పూనావాలా, మనోజ్ మిట్టల్ కొత్త సభ్యులుగా చేరబోతున్నారు.
స్టీల్ కింగ్ ప్రస్థానం..
రాజస్థాన్లోని సదుల్పూర్లో జన్మించిన లక్ష్మీ మిట్టల్, ప్రస్తుతం ఫోర్బ్స్ జాబితా ప్రకారం భారతదేశపు 4వ అత్యంత ధనవంతుడు. ఆయన నికర ఆస్తి విలువ 28.4 బిలియన్ డాలర్లు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉక్కు సంస్థ ‘ఆర్సెలార్ మిట్టల్’ ద్వారా ఆయన తన సామ్రాజ్యాన్ని నిర్మించారు. 1995లో లండన్ వెళ్లిన ఆయన, ఇటీవలే యూకేను విడిచి దుబాయ్కు మారాలని నిర్ణయించుకోవడం గమనార్హం. మొదటి సీజన్ (2008) విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్, ఇప్పుడు స్టీల్ కింగ్ చేతుల్లోకి వెళ్లడంతో ఫ్రాంచైజీ మరింత బలోపేతం అవుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
-
Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్కు NIA సమన్లు
-
AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!