Champions Trophy: భారత్ గ్రాండ్ విక్టరీ.. అనుష్కకు కోహ్లీ విన్నింగ్ హగ్..
- ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో భారత్ గ్రాండ్ విక్టరీ
- అనుష్కకు కోహ్లీ విన్నింగ్ హగ్
- ఇద్దరూ కలిసి టైటిల్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఫైనల్ లో న్యూజీలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ మూడోసారి గెలుచుకున్న జట్టుగా హిస్టరీ క్రియేట్ చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ రెండోసారి ICC ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయంలో జట్టులోని ఆటగాళ్లు అందరు కీలక పాత్ర పోషించారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించిన తర్వాత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్టంప్స్ తీసుకుని గ్రౌండ్ లో దాండియా నృత్యం చేశారు. విజయం తర్వాత కోహ్లీ తన భార్య అనుష్క శర్మ వద్దకు వెళ్లి ఆమెను కౌగిలించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి.
Also Read:IND vs NZ: రోహిత్ ఖాతాలో మరో “హిట్టు”.. భారత్ ఘన విజయం..
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
- Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్లో రెండో సెంచరీ నమోదు..
- Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
హగ్ చేసుకున్న తర్వాత ఆటగాళ్లు సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న మైదానానికి అనుష్కను తీసుకువచ్చాడు. టీమిండియా విజయం తర్వాత విరాట్, అనుష్క మధ్య ఒక ప్రేమకథ కనిపించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ను చూసేందుకు అనుష్క శర్మ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకి వచ్చింది. భారత్ గెలుపు తర్వాత విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ గ్యాలరీ నుంచి దిగి మైదానం వైపు రావడం ప్రారంభించింది. తర్వాత విరాట్ అనుష్క వైపు పరిగెత్తి మెట్లపై తన భార్యను కౌగిలించుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుంటూ మెట్లపై కొంతసేపు నిలబడ్డారు.
Also Read:
AICC: ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్.. సినీ నటికి అవకాశం!
ఆ తర్వాత కోహ్లీ అనుష్క చేయి పట్టుకుని కిందికి తీసుకువచ్చాడు. ఇద్దరూ కలిసి టైటిల్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. విరుష్క ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. కాగా విరాట్ ఫైనల్లో రానించలేదు.. కానీ పాకిస్తాన్ పై సెంచరీ, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అర్ధ సెంచరీ మర్చిపోలేనివి. ఫైనల్లో భారత్ 49 ఓవర్లలో 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
This moment!🏆❤️#AnushkaSharma hugged #ViratKohli after India's epic win in the #ICCChampionsTrophy2025 finals. #INDvsNZ pic.twitter.com/QmEDAJcziu
— Filmfare (@filmfare) March 9, 2025
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!