న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో భారత జట్టు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్ లో నేడు చివరి రోజు ఆట ప్రారంభమైన కాసేప్పటికే కెప్టెన్ కోహ్లీ(13) ఔట్ కాగా అదే బౌలర్ వేసిన తర్వాతి ఓవర్లో పుజారా(15) కూడా పెవిలియన్ చేరుకోవడంతో భారత్ కష్టాల్లో పడింది. 72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత జట్టు కివీస్ పై 40 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక ప్రస్తుతం రహానేతో కలిసి పంత్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో టీం ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో 217 పరుగులు చేయగా విలియమ్సన్ సేన 249 పరుగులు చేసింది.