Yashasvi Jaiswal: ముందే ప్లాన్ చేశా, లెక్కలేసుకొని మరీ చితకొట్టా.. ఆసక్తికర విషయాలు చెప్పిన జైస్వాల్!
- ఐపీఎల్ 2026లో దూసుకెళుతోన్న రాజస్థాన్
- రాజస్థాన్ విజయంలో యశస్వి జైస్వాల్ కీలక పాత్ర
- 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులతో 77 పరుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) దూసుకెళుతోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లలో విజయాలు అందుకుంది. మంగళవారం రాత్రి గౌహతిలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్ఆర్ 27 పరుగుల తేడాతో గెలిచింది. రాజస్థాన్ విజయంలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కీలక పాత్ర పోషించాడు. 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులతో 77 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం తన బ్యాటింగ్ ప్లాన్పై జైస్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పవర్ప్లేలో తీసుకున్న నిర్ణయాలు మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేశాయని వెల్లడించాడు. ముందుగానే ప్లాన్ చేసి ముంబై బౌలర్లపై దాడి చేశామని చెప్పాడు. వైభవ్ సూర్యవంశీ, తాను లెక్కలేసుకొని మరీ చితకొట్టామని చెప్పుకొచ్చాడు.
‘పవర్ప్లేలో కేవలం మూడు ఓవర్లు మాత్రమే ఉండటంతో నా మైండ్లో ముందుగానే ఒక ప్లాన్ వేసుకున్నా. ఏ ఓవర్లను టార్గెట్ చేయాలి, ఎవరిపై దాడి చేయాలి అన్నది ఆలోచించాను. దీపక్ చాహర్ బౌలింగ్కు రాగానే అతడిపై దాడి చేయొచ్చని అనుకున్నాను. తర్వాత జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్కు వచ్చాడు. బుమ్రాను వైభవ్ టార్గెట్ చేస్తే బాగుంటుంది, నేను ఇంకొకరిని చూసుకుంటాను అని అనుకున్నాను. ఇలా ఎవరిపై దాడి చేయాలి, ఏ షాట్లు ఆడాలి అన్నది నిరంతరం ఆలోచిస్తూ మ్యాచ్లో పూర్తిగా ఫోకస్ పెట్టాను. మూడు ఫార్మాట్లలో ఆడడం అంత ఈజీ కాదు. కానీ ప్రతి సారి నా ప్రిపరేషన్లో నేను ఎలా మెరుగుపడాలో, ఏమి చేయాలో అని ఆలోచిస్తాను. నా షాట్లను మేరుపర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ప్రతి వికెట్కు ఏ షాట్లు సరిపోతాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. నేను ప్రాక్టీస్ చేసి.. వాటినే మ్యాచులో ఆడుతా’ అని యశస్వి జైస్వాల్ చెప్పాడు.
Also Read
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
- RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
- Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
- PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
Also Read: TVK Chief Vijay: టీవీకే విజయ్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీ మనతోనే..!
‘ముందే వేసుకున్న ప్లాన్తో పాటు పరిస్థితిని అర్థం చేసుకుని షాట్లు ఆడతాను. జట్టుకు ఏం అవసరమో అదే చేయాలని చూస్తాను. నా ఆటను ఎప్పటికప్పుడు మార్చుకునే ప్రయత్నం చేస్తాను. ఏ షాట్ అవసరమో దాన్ని ఆడేందుకు ప్రయత్నిస్తాను. జట్టు ప్రయోజనాలే నాకు ముఖ్యం. వైభవ్ అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు చాలా కష్టపడుతున్నాడు. అతన్ని చూసి నేను కూడా ప్రేరణ పొందుతున్నాను. మేము తరచూ మాట్లాడుకుంటూ ఎలా ఆడాలి అనే విషయంపై చర్చిస్తుంటాం. నువ్వు ఫ్రీగా ఆడు అని నేను ప్రోత్సహిస్తాను. వైభవ్ ఆటను చాలా బాగా అర్థం చేసుకుంటాడు. ఎవరి సలహాలు అవసరం లేకుండా తనంతట తానే అద్భుతంగా ఆడగలడు’ అని జైస్వాల్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..