Chennai Super Kings: చెన్నై ఓడిపోయినా.. ఎంఎస్ ధోనీ బాగా ఆడితే చాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni entertained fans Says Virender Sehwag: ఎంఎస్ ధోనీని చూడటానికే క్రికెట్ అభిమానులు ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లను చూసేందుకు వస్తున్నారని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. మ్యాచ్ను చూడటానికి వచ్చే అభిమానులు టికెట్ కొనుగోలు చేసిన మొత్తానికి మహీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడన్నాడు. చెన్నై విజయం సాధించినా, ఓడిపోయినా అభిమానులకు అవసరం లేదని.. ధోనీ బాగా ఆడితే చాలని సెహ్వాగ్ పేర్కొన్నాడు. గుజరాత్పై ఓడిన చెన్నై.. ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచ్లలో గెలిస్తేనే యెల్లో ఆర్మీ ముందడుగు వేస్తుంది.
శుక్రవారం గుజరాత్పైతో జరిగిన మ్యాచ్లో ఎంఎస్ ధోనీ అభిమానులను అలరించాడు. ఎనిమిదో స్థానంలో క్రీజ్లోకి వచ్చిన మహీ కేవలం 11 బంతుల్లోనే 1 ఫోర్, 3 సిక్సర్లతో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చెన్నై ఓడిపోతుందని తెలిసినా.. ధోనీ ఇన్నింగ్స్తో అభిమానులు ఆనందపడిపోయారు. ఈ విషయంపై వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మనం ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ స్థానం గురించి చర్చలు ఆపేయాలి. అతడు ఏం చేయాలనుకుంటున్నాడనే దానిపై పూర్తి అవగాహన ఉంది. ఒకవేళ మీరు చెన్నై గెలవాలని కోరుకుంటే.. ధోనీ ఆడుతున్న స్ట్రైక్రేట్తో మిగతా చెన్నై ఆటగాళ్లు ఆడాలి. అప్పుడు చెన్నై సులువుగా గెలుస్తుంది’ అని క్రిక్బజ్లో మాట్లాడుతూ సెహ్వాగ్ అన్నాడు.
Also Read
- Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav's Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
- Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
Also Read: James Anderson Retirement: క్రికెట్కు గుడ్బై చెప్పిన ‘స్వింగ్ కింగ్’ జేమ్స్ అండర్సన్!
‘నేను వివాదాల్లోకి రావాలనుకోవడం లేదు. ఎంఎస్ ధోనీ ఎక్కడ బ్యాటింగ్ చేసినా సరే బాగా ఆడాడు. అభిమానులను అలరిస్తున్నాడు. మ్యాచ్ను చూడటానికి వచ్చే ఫాన్స్ టికెట్ కొనుగోలు చేసిన మొత్తానికి ధోనీ కారణంగా ఎంటర్టైన్మెంట్ దొరికినట్లే. భారీ షాట్లతో విరుచుకుపడుతూ.. బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. చెన్నై విజయం సాధించినా.. ఓడిపోయినా ఆ జట్టు అభిమానులకు అవసరం లేదు. వారికి ధోనీ బాగా ఆడితే చాలు. ప్రేక్షకులు కూడా మహీ ఆటను చూసేందుకే వస్తున్నారు. ధోనీ కూడా వారిని ఎంటర్టైన్ చేసేందుకే ఆడుతున్నాడు’ అని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
-
AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
-
Pooja Hegde: సీఎంపైనే పూజా హెగ్డే ఆశలు!
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!