Chennai Super Kings: చెన్నై ఓడిపోయినా.. ఎంఎస్ ధోనీ బాగా ఆడితే చాలు!
MS Dhoni entertained fans Says Virender Sehwag: ఎంఎస్ ధోనీని చూడటానికే క్రికెట్ అభిమానులు ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లను చూసేందుకు వస్తున్నారని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. మ్యాచ్ను చూడటానికి వచ్చే అభిమానులు టికెట్ కొనుగోలు చేసిన మొత్తానికి మహీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడన్నాడు. చెన్నై విజయం సాధించినా, ఓడిపోయినా అభిమానులకు అవసరం లేదని.. ధోనీ బాగా ఆడితే చాలని సెహ్వాగ్ పేర్కొన్నాడు. గుజరాత్పై ఓడిన చెన్నై.. ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచ్లలో గెలిస్తేనే యెల్లో ఆర్మీ ముందడుగు వేస్తుంది.
శుక్రవారం గుజరాత్పైతో జరిగిన మ్యాచ్లో ఎంఎస్ ధోనీ అభిమానులను అలరించాడు. ఎనిమిదో స్థానంలో క్రీజ్లోకి వచ్చిన మహీ కేవలం 11 బంతుల్లోనే 1 ఫోర్, 3 సిక్సర్లతో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చెన్నై ఓడిపోతుందని తెలిసినా.. ధోనీ ఇన్నింగ్స్తో అభిమానులు ఆనందపడిపోయారు. ఈ విషయంపై వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మనం ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ స్థానం గురించి చర్చలు ఆపేయాలి. అతడు ఏం చేయాలనుకుంటున్నాడనే దానిపై పూర్తి అవగాహన ఉంది. ఒకవేళ మీరు చెన్నై గెలవాలని కోరుకుంటే.. ధోనీ ఆడుతున్న స్ట్రైక్రేట్తో మిగతా చెన్నై ఆటగాళ్లు ఆడాలి. అప్పుడు చెన్నై సులువుగా గెలుస్తుంది’ అని క్రిక్బజ్లో మాట్లాడుతూ సెహ్వాగ్ అన్నాడు.
Also Read
- GT VS PBKS: గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్కే పరిమితమైన PBKS..
- Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
- SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపై పాట్ కమిన్స్ తీవ్ర ఆవేదన.. దాని వల్లనే ఓడిపోయామంటూ..
- SRH Vs KKR: ఆరో విజయానికి కళ్లెం వేసిన కేకేఆర్.. ఓటమిలోనూ అభిషేక్ శర్మ రికార్డు..
Also Read: James Anderson Retirement: క్రికెట్కు గుడ్బై చెప్పిన ‘స్వింగ్ కింగ్’ జేమ్స్ అండర్సన్!
‘నేను వివాదాల్లోకి రావాలనుకోవడం లేదు. ఎంఎస్ ధోనీ ఎక్కడ బ్యాటింగ్ చేసినా సరే బాగా ఆడాడు. అభిమానులను అలరిస్తున్నాడు. మ్యాచ్ను చూడటానికి వచ్చే ఫాన్స్ టికెట్ కొనుగోలు చేసిన మొత్తానికి ధోనీ కారణంగా ఎంటర్టైన్మెంట్ దొరికినట్లే. భారీ షాట్లతో విరుచుకుపడుతూ.. బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. చెన్నై విజయం సాధించినా.. ఓడిపోయినా ఆ జట్టు అభిమానులకు అవసరం లేదు. వారికి ధోనీ బాగా ఆడితే చాలు. ప్రేక్షకులు కూడా మహీ ఆటను చూసేందుకే వస్తున్నారు. ధోనీ కూడా వారిని ఎంటర్టైన్ చేసేందుకే ఆడుతున్నాడు’ అని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
GT VS PBKS: గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్కే పరిమితమైన PBKS..
-
Karimnagar PMG Jewellery : పీఎంజీ జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
-
Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
-
Anemia in Children : చిన్నపిల్లల్లో రక్తహీనత.. తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలు, నివారణ మార్గాలు.!
-
Varanasi: మహేష్ బాబు వారణాసికి నీటి కష్టాలు.. జక్కన్న రిక్వెస్ట్కు సింపుల్గా నో చెప్పిన జలమండలి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!