Virat Kohli: నాకు చాలా భయమేస్తోంది.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
- మనసులోని మాట బయటపెట్టిన కింగ్ కోహ్లీ
- ఐపీఎల్లో చాలా ఎక్కువైపోతోంది
- అసౌకర్యంపై కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli RCB Podcast: టీమిండియా స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏ విషయంపై అయినా ముక్కుసూటిగా మాట్లాడతాడు. 2027 వన్డే వరల్డ్ కప్లో తన భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వాలని బీసీసీఐని సూటిగా అడిగినట్లు కొన్ని జాతీయ మీడియాలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. తాజాగా మరో విషయంపై కింగ్ తన మనసులోని మాట బయటపెట్టాడు. సోషల్ మీడియా, గ్లామర్కు కాస్త దూరంగా ఉండేందుకు ఇష్టపడే కోహ్లీ.. ఐపీఎల్లో ఆటగాళ్ల ప్రైవసీ దెబ్బతింటోందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ప్రాక్టీస్ సెషన్ల సమయంలో కెమెరాల హడావుడి ఎక్కువైందని, అది ఆటగాళ్లకు అసౌకర్యంగా మారుతోందని కోహ్లీ పేర్కొన్నాడు.
ఆర్సీబీ పోడ్కాస్ట్లో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. ప్రాక్టీస్ సమయంలో ఆటగాళ్లపై ఎప్పుడూ కెమెరాలు ఉండటం వల్ల సహజంగా ప్రాక్టీస్ చేయలేకపోతున్నామని తెలిపాడు. ‘ప్రాక్టీస్కు వెళ్తే ఆరు కెమెరాలు వెంట వస్తుంటాయి. అది అసలు కంఫర్ట్గా ఉండదు. ఒక ప్లేయర్ ప్రశాంతంగా తన ఆటను ఆడుకునే స్వేచ్ఛ ఉండాలి. కానీ ఇప్పుడు మేము చేసే చేసే ప్రతి దాన్ని షూట్ చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం, దానిపై చర్చించడం జరుగుతోంది’ అంటూ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ప్రాక్టీస్ సమయంలో కొత్త విషయాలు ప్రయత్నించాలన్నా ఇప్పుడు తనకు భయం వేస్తోందని విరాట్ కోహ్లీ చెప్పాడు. ‘నెట్స్లో నేను కొత్తగా ఏదైనా ట్రై చేస్తే.. దాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తారు. తర్వాత నా ప్రాక్టీస్పైనే చర్చ జరుగుతుంటుంది. మ్యాచ్లో చేసిన ప్రదర్శన ఆధారంగా నన్ను అంచనా వేయాలి. కానీ నా ప్రిపరేషన్ గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు’ అని స్పష్టం చేశాడు. ఆటగాళ్లను చిత్రీకరించే విషయంలో కొంత పరిమితి అవసరమని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ‘ఎంతవరకు చిత్రీకరించాలి?, ఎప్పుడు షూట్ చేయాలి?, ఆటగాడు కెమెరాలో కనిపించడానికి సౌకర్యంగా ఉన్నాడా? లేదా? అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్రతిదీ షూట్ చేస్తున్నారు. ఇది చాలా ఎక్కువైపోతోంది’ అని తెలిపాడు.
తనకు ఆటలో ఉండే ఒత్తిడి ఇష్టమే కానీ.. సోషల్ మీడియా, కమర్షియల్ ఒత్తిడి మాత్రం నచ్చదని కోహ్లీ కోహ్లీ స్పష్టం చేశాడు. ‘ఫ్యాన్ ఎంగేజ్మెంట్కు, జట్ల కమర్షియల్ ప్రమోషన్కు సోషల్ మీడియా ముఖ్యమని అర్థం చేసుకుంటా. కానీ దీనికి కూడా ఒక హద్దు ఉండాలి. ఐపీఎల్ మొదలైనప్పుడు సోషల్ మీడియా ఈ స్థాయిలో లేదు. అధికారిక ఫ్యాన్ పేజీలు, సోషల్ మీడియా కల్చర్ తర్వాతి కాలంలో పెరిగాయి. అందుకే అప్పట్లో ఆటగాళ్లు తమకు నచ్చిన రీతిలో ప్రాక్టీస్ చేశారు’ అని విరాట్ వ్యాఖ్యానించాడు. కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆటగాళ్ల ప్రైవసీ, సోషల్ మీడియా ప్రభావంపై మరోసారి పెద్ద చర్చకు దారితీశాయి.
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!