CSK- IPL 2025: రిటెన్షన్ను సీఎస్కే చాలా అద్భుతంగా వినియోగించుకుంది..
- అనుకున్నట్లుగానే కొనసాగిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ రిటెన్షన్..
- కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్గానే తీసుకున్న సీఎస్కే..
- కేవలం రూ. 4 కోట్లకే మహేంద్ర సింగ్ ధోనీని దక్కించుకున్న చెన్నై సూపర్ కింగ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK- IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ రిటెన్షన్ అనుకున్నట్లుగానే కొనసాగింది. ‘కెప్టెన్ కూల్’ఎంఎస్ ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్గానే సీఎస్కే తీసుకుంది. కేవలం 4 కోట్ల రూపాయలకే ధోనీకి చెల్లించనుంది. దీంతో మెగా వేలానికి ముందు చెన్నైకు సుమారు రూ.10 నుంచి రూ. 15 కోట్ల వరకు అదనంగా డబ్బు మిగిలిందని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కామెంట్స్ చేశారు. మెగా వేలంలో స్టార్ క్రికెటర్లను దక్కించుకొనే వెసులుబాటు కలిగిందని చెప్పుకొచ్చారు.
Read Also: Free Gas Scheme: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు!
Also Read
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
- SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
అలాగే, చెన్నై చాలా అద్భుతంగా రిటెన్షన్ను వాడుకుంది. అన్క్యాప్డ్ రూల్ను వెనక్కి తీసుకురావడం వారికి కలిసొచ్చింది అని మాజీ క్రికెటర్ కైఫ్ చెప్పారు. ధోనీ మరొక సీజన్ ఆడాలని మనం కూడా బలంగా కోరుకుంటున్నాం.. అతడిని మైదానంలో చూడటం ఆనందంగా ఉందన్నారు. సీఎస్కే ఈ విషయంలో చాలా స్మార్ట్గా వ్యవహరించిందన్నారు. తక్కువ మొత్తానికే ధోనీని తీసుకుంది.. భారత్ జట్టుకు నేను చివరి మ్యాచ్ ఆడేటప్పటికి నా వయసు 36 కాగా.. ఒక్క మ్యాచ్ ఆడినా అది ఇంటర్నేషనల్ అరంగేట్రం చేసినట్లే అన్నారు. ఒకవేళ నన్ను జట్టులో నుంచి తీసేసి పక్కన పెట్టినా ఐపీఎల్లో మాత్రం అద్భుతంగా ఆడుతున్నా.. అప్పుడు అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ నాకు వర్తించదని చెప్పుకొచ్చారు. ఇది కేవలం అంతర్జాతీయ మ్యాచులను ఆడ నివారికి మాత్రమే కావాలని మహ్మద్ కైఫ్ పేర్కొన్నారు.
Read Also: Vikkatakavi : తెలుగు, తమిళ భాషల్లో ఓటీటీ లో రిలీజ్ కానున్న‘వికటకవి’
అయితే, మహేంద్ర సింగ్ ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్గా రిటైన్ చేసుకోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఐపీఎల్లో ఈ రూల్ను ధోనీ కోసమే తీసుకోచ్చారనే అనుమానం కలుగుతుంది.. ఒకవేళ ఇప్పుడు మళ్లీ మనిద్దరం ఆడాలనుకుంటే అన్క్యాప్డ్ ప్లేయర్లం అవుతామని మంజ్రేకర్ పేర్కొన్నారు. కాగా, సీఎస్కే ధోనీతో పాటు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, పతిరన, శివమ్ దూబెను రిటైన్ చేసుకున్నట్లు వెల్లడించింది.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!