SRH vs CSK: నేడు ఉప్పల్ మైదానంలో ఆసక్తికర పోరు.. ధోనీ దిగుతాడా?, మ్యాచ్ సజావుగా సాగేనా?
- ఉప్పల్ మైదానంలో ఎస్ఆర్హెచ్ vs సీఎస్కే మ్యాచ్
- ఉప్పల్ స్టేడియంలో ధోనీ బరిలోకి దిగుతాడా?
- వాతావరణ పరిస్థితుల కారణంగా మ్యాచ్ సజావుగా సాగేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Will MS Dhoni Return IPL 2026 with SRH vs CSK: ఐపీఎల్ 2026లో నేడు ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఉప్పల్ మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అమీతుమీ తేల్చుకోనున్నాయి. మిడ్ టేబుల్లో ఉన్న ఈ రెండు జట్లు తమ తమ స్థానాలను మెరుగుపరుచుకోవడానికి ఈ మ్యాచ్లో విజయంను అత్యంత కీలకంగా భావిస్తున్నాయి. ఎస్ఆర్హెచ్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్లలో రెండు గెలవగా.. సీఎస్కే కూడా రెండు విజయాలు అందుకుంది. అయితే ఎస్ఆర్హెచ్, సీఎస్కే మ్యాచ్ నేపథ్యంలో అభిమానుల దృష్టి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఉప్పల్ స్టేడియంలో దిగుతాడా?, వాతావరణ పరిస్థితుల కారణంగా మ్యాచ్ సజావుగా సాగేనా? అనే వాటిపై ఉన్నాయి.
గాయం కారణంగా ఐపీఎల్ 2026లో ఎంఎస్ ధోనీ ఇప్పటివరకు ఆడలేదు. సీఎస్కే తొలి 5 మ్యాచ్ల్లో ఆడని మహీ.. ఈ మ్యాచ్లో అయినా ఆడతాడా లేదా అన్నది ఆసక్తిగా ఉంది. రెండు రోజుల క్రితమే హైదరాబాద్కు చేరుకున్న ధోనీ.. ఉప్పల్ మైదానంలో ప్రాక్టీస్ కూడా చేశాడు. మహీ రాకతో మ్యాచ్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ధోనీ ప్రాక్టీస్ చూస్తే మాత్రం ఈరోజు ఆడే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ధోనీ ఆడేది లేనిది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. రెండు వరుస విజయాలతో ఫామ్లోకి వచ్చిన చెన్నై.. సన్రైజర్స్ను ఓడించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది.
Also Read
- Nitish Rana Out: నితీష్ రాణా ఔట్పై వివాదం.. డెడ్ బాల్ ఇవ్వాలా?.. నిబంధనలు ఏమంటున్నాయి?
- IPL 2026 Final: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. ఫైనల్ మ్యాచ్ ఎక్కడో తెలుసా?
- Rajasthan Royals FIR: వైభవ్ సూర్యవంశీ వివాదం.. రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీపై ఎఫ్ఐఆర్ నమోదు!
- IPL 2027: ఐపీఎల్ 2026 తర్వాత భారీ మార్పులు.. కెప్టెన్స్, కోచ్లు మూల్యం చెల్లించుకోక తప్పదు!
హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు చాలా తక్కువ. కొన్ని ప్రాంతాల్లో మేఘావృతం ఉన్నప్పటికీ.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్లో అప్పుడప్పుడు వచ్చే సమ్మర్ షవర్స్ ఈ మ్యాచ్ను ప్రభావితం చేసే అవకాశాలు లేవు. మ్యాచ్ సమయంలో తేమ సుమారు 45 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. దీనివల్ల రెండో ఇన్నింగ్స్లో డ్యూ ప్రభావం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో బౌలర్లకు, ముఖ్యంగా స్పిన్నర్లకు బంతిని పట్టుకోవడం కష్టమవుతుంది. అందుకే టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకోనుంది.
Also Read: Shubman Gill: గ్రీన్ బ్యాటింగ్తో కంగారు పడ్డా.. ఆ ఇద్దరినీ అడిగి మరీ బంతినిచ్చా!
మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు చేరుతుండగా.. మ్యాచ్ ప్రారంభానికి సమయానికి 27 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ పగటి వేడి ప్రభావం ఆటగాళ్ల శారీరక సామర్థ్యాన్ని పరీక్షించనుంది. ఉప్పల్ పిచ్ సాధారణంగా బ్యాట్స్మెన్కు అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఎండల కారణంగా పిచ్ వేగంగా, బౌన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో హై స్కోరింగ్ మ్యాచ్ కావచ్చని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..
-
TVK Vijay: విజయ్కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ భోర్సే బర్త్ డే.. ‘లెనిన్’ డిఫరెంట్ పోస్టర్ విడుదల
-
Ragi Burfi Recipe: ఎముకలకు బలం.. రక్తహీనతకు చెక్.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసుకునే హెల్తీ స్వీట్!
-
Pratyusha Paul : చార్మినార్ సాక్షిగా బెంగాల్ నటికి వేధింపులు: నిందితుడికి ‘చిప్పకూడు’!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!