Shreyas Iyer IPL Record: శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’!
- పంజాబ్ కింగ్స్కు మరో భారీ షాక్
- 6 ఆరు వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం
- శ్రేయస్ అయ్యర్ ఖాతాలో చెత్త రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో పంజాబ్ కింగ్స్కు మరో భారీ షాక్ తగిలింది. ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన కీలక మ్యాచ్లో 200 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ.. పంజాబ్కు ఓటమి తప్పలేదు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 19.5 ఓవర్లలో 205/4 స్కోర్ చేసి ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో పంజాబ్ కింగ్స్ వరుసగా ఐదో ఓటమిని చవిచూసి ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 200/8 పరుగులు చేసింది. ఒక దశలో 170-180 మధ్య స్కోర్కే పరిమితమయ్యేలా కనిపించిన పంజాబ్.. చివర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్ ధాటిగా ఆడడంతో జట్టు స్కోర్ 200 పరుగుల మార్క్ దాటింది. అయితే భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో పంజాబ్ బౌలర్లు మరోసారి విఫలమయ్యారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో సరైన బౌలింగ్ చేయలేకపోవడం జట్టుకు పెద్ద మైనస్గా మారింది. ముంబై ఇండియన్స్ తరఫున తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తెలుగు క్రికెటర్ తిలక్ కేవలం 33 బంతుల్లోనే 75 పరుగులు చేసి మ్యాచ్ను పూర్తిగా ముంబై వైపు తిప్పేశాడు. తిలక్కు తోడు మిగతా బ్యాటర్లు కూడా కీలక సమయంలో బాధ్యతగా ఆడటంతో ముంబై సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఈ ఓటమితో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేరుపై ఓ చెత్త రికార్డు నమోదైంది. ఐపీఎల్ చరిత్రలో 200కిపైగా స్కోర్ను డిఫెండ్ చేస్తూ.. అత్యధిక మ్యాచ్లు ఓడిపోయిన కెప్టెన్గా శ్రేయస్ నిలిచాడు. ఇప్పటివరకు అతడు 20 మ్యాచ్ల్లో ఏడు ఓటములను ఎదుర్కొన్నాడు. దాంతో శ్రేయస్ ఖాతాలో చెత్త రికార్డు చేరింది. ఐపీఎల్ చరిత్రలో ఇన్ని ఓటములు చవిచూసిన మొదటి సారథిగా శ్రేయస్ రికార్డుల్లో నిలిచాడు. ఒక్క ఫాఫ్ డుప్లెసిస్ మాత్రమే అన్ని టీ20 లీగ్ల కలిపి ఇంతకంటే ఎక్కువ ఓటములు చవిచూశాడు.
మరోవైపు పంజాబ్ కింగ్స్ 2026 సీజన్లో ఐదు వరుస విజయాల తర్వాత ఐదు వరుస పరాజయాలు చవిచూసిన రెండో జట్టుగా నిలిచింది. 2022లో సన్రైజర్స్ హైదరాబాద్ ఇలానే వరుస పరాజయాలు చవిచూసింది. టోర్నీ తొలి భాగంలో అద్భుత ఫామ్లో కనిపించిన పంజాబ్.. ఇప్పుడు వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో పడింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన మ్యాచ్ల్లో తప్పనిసరిగా విజయాలు సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై ఇండియన్స్ మాత్రం యువ ఆటగాళ్లతో అద్భుత పోరాటం చేస్తూ ఇతర జట్ల సమీకరణాలను దెబ్బతీస్తోంది.
తాజావార్తలు
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!