Riyan Parag: మీకు అవసరం లేదు.. వేప్ వివాదంపై పరాగ్ సంచలన వ్యాఖ్యలు!
- ఐపీఎల్ 2026లో పెద్ద చర్చనీయాంశంగా వేప్ వివాదం
- డ్రెస్సింగ్ రూమ్లో ఈ-సిగరెట్ తాగుతూ దొరికిన పరాగ్
- వేప్ వివాదంపై పరాగ్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RR Captain Riyan Parag React on Vape Controversy: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కెప్టెన్ రియాన్ పరాగ్ చుట్టూ వేప్ (ఈ-సిగరెట్) వివాదం పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్లో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాలకు చిక్కాడు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పరాగ్పై ఐపీఎల్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతతో పాటు ఓ డిమెరిట్ పాయింట్ చేర్చారు. పరాగ్ తన తప్పును అంగీకరించడంతో… ఎలాంటి విచారణ అవసరం లేకుండా పోయింది.
ఈ-సిగరెట్ అంశంపై అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో విభిన్న విమర్శల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అనంతరం రియాన్ పరాగ్ స్వయంగా స్పందించాడు. తాను విమర్శలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనని, తన దృష్టి పూర్తిగా ఆటపైనే ఉందని స్పష్టం చేశాడు. ‘ఈ విషయంపై విమర్శకులకు లేదా ఇతరులకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. రోజు చివరికి నా పని జట్టుకు రెండు పాయింట్లు అందించడమే. బయట జరిగే వివాదాలపై నేను ఫోకస్ చేయను. జట్టుగా విజయం సాధించడం ముఖ్యం. వ్యక్తిగత అంశాలు నా దృష్టి మరల్చలేవు’ అని పరాగ్ చెప్పాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో రియాన్ పరాగ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సులతో 90 రన్స్ చేశాడు. ఎట్టకేలకు ఫామ్ అందుకుని కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినా.. రాజస్థాన్ను గెలిపించలేకపోయాడు. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు విజయం ముఖ్యమని పరాగ్ తెలిపాడు. ‘నేను ఎంత బాగా ఆడినా జట్టు ఓడిపోతే ఆ ఇన్నింగ్స్కు విలువ ఉండదు. భారీ స్కోర్ చేసినా ఓడినందుకు బాధగానే ఉంది. మాకు ఇప్పుడు ఒక వారం విరామం ఉంది. ఆ సమయంలో వివాదంను క్లియర్ చేస్తాం. ప్రస్తుతం రాజస్థాన్ ప్లేఆఫ్స్ రేస్లో ఉంది. కాబట్టి జట్టు ఫోకస్ మొత్తం మ్యాచ్లపై ఉంది’ అని పరాగ్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
-
YS Jagan: ‘నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను’.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
-
Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!