IPL 2025: వాళ్లు ఐపీఎల్ అంపైర్స్ కాదు.. ముంబై అంపైర్స్!
- ఐపీఎల్ లో తలనొప్పిగా మారుతున్న అంపైరింగ్ విధానం..
- ముంబై ఇండియన్స్ కి అనుకూలంగా ప్రవర్తించడంతో వివాదం..
- ముంబైకి సపోర్టుగా పని చేస్తున్నారంటూ నెట్టింట విమర్శలు..
IPL 2025: ఐపీఎల్ 2025లో అంపైరింగ్ విధానం తలనొప్పిగా మారుతుంది. ఈ సీజన్లో సమస్య మరింత ఎక్కువైంది. బంతి బ్యాట్ కు తగలకున్నా ఔట్ ఇవ్వడం, డీఆర్ఎస్ విషయంలో అంపైర్లు కొన్ని ఫ్రాంచైజీలకు అనుకూలంగా ప్రవర్తించడం వివాదాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ విషయంలో అంపైర్లు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఆ మధ్య హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అవుట్ అయిన విధానంపై అంపైర్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇషాన్ విషయంలో అంపైర్ ముంబై ఇండియన్స్ కి అనుకూలంగా నిర్ణయం ప్రకటించాడంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
Read Also: PM Modi: ఏపీకి మళ్లీ వస్తాను.. సీఎం చంద్రబాబుకు థ్యాంక్స్!
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
- DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
అయితే, తాజాగా మరోసారి డీఆర్ఎస్ డిసీషన్ వివాదాస్పదమైంది. ముంబై – రాజస్థాన్ మ్యాచ్ లో భాగంగా రోహిత్ శర్మను డీఆర్ఎస్ విషయంలో కాపాడారంటూ అంపైర్ పై మండిపడుతున్నారు నెటిజన్స్. ముంబై ఇన్నింగ్స్ రెండో ఓవర్లో అంపైర్ రోహిత్ ను ఎల్బీగా ప్రకటించాడు. కానీ, రోహిత్ చివరి క్షణంలో రివ్యూ కోరాడు. థర్డ్ అంపైర్ బాల్ ట్రాకింగ్ చేయడంతో బంతి లెగ్ స్టంప్ బయట పిచ్ అయినట్లు తేలింది. దీంతో ఆన్-ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇక, సమస్య ఎక్కడ వచ్చిందంటే.. డీఆర్ఎస్ నిబంధనల ప్రకారం 15 సెకన్లలోపే రివ్యూ తీసుకోవాలి. అయితే, ఈ మ్యాచ్ లో రోహిత్ రివ్యూ కోరినప్పుడు టైమర్ 0 సెకన్లు చూపించింది. అంటే రివ్వ్యూ టైం కంప్లీట్ అయినా అంపైర్లు రోహిత్ రివ్యూ ఓకే చేశారు.
Read Also: GT vs SRH: మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్ రేసులో ఎస్ఆర్ఎచ్ నిలుస్తుందా? మొదట బ్యాటింగ్ చేయనున్న జీటి
కాగా, ఈ డ్రామా తర్వాత రోహిత్ శర్మ చెలరేగి ఆడాడు. 53 పరుగులతో ఈ ఐపీఎల్ మరో అద్భుతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఏకంగా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ముంబై టేబుల్ టాప్ లో కొనసాగుతుంది.
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!