IPL 2025: వాళ్లు ఐపీఎల్ అంపైర్స్ కాదు.. ముంబై అంపైర్స్!
- ఐపీఎల్ లో తలనొప్పిగా మారుతున్న అంపైరింగ్ విధానం..
- ముంబై ఇండియన్స్ కి అనుకూలంగా ప్రవర్తించడంతో వివాదం..
- ముంబైకి సపోర్టుగా పని చేస్తున్నారంటూ నెట్టింట విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025: ఐపీఎల్ 2025లో అంపైరింగ్ విధానం తలనొప్పిగా మారుతుంది. ఈ సీజన్లో సమస్య మరింత ఎక్కువైంది. బంతి బ్యాట్ కు తగలకున్నా ఔట్ ఇవ్వడం, డీఆర్ఎస్ విషయంలో అంపైర్లు కొన్ని ఫ్రాంచైజీలకు అనుకూలంగా ప్రవర్తించడం వివాదాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ విషయంలో అంపైర్లు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఆ మధ్య హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అవుట్ అయిన విధానంపై అంపైర్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇషాన్ విషయంలో అంపైర్ ముంబై ఇండియన్స్ కి అనుకూలంగా నిర్ణయం ప్రకటించాడంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
Read Also: PM Modi: ఏపీకి మళ్లీ వస్తాను.. సీఎం చంద్రబాబుకు థ్యాంక్స్!
Also Read
- Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
- Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
- Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
అయితే, తాజాగా మరోసారి డీఆర్ఎస్ డిసీషన్ వివాదాస్పదమైంది. ముంబై – రాజస్థాన్ మ్యాచ్ లో భాగంగా రోహిత్ శర్మను డీఆర్ఎస్ విషయంలో కాపాడారంటూ అంపైర్ పై మండిపడుతున్నారు నెటిజన్స్. ముంబై ఇన్నింగ్స్ రెండో ఓవర్లో అంపైర్ రోహిత్ ను ఎల్బీగా ప్రకటించాడు. కానీ, రోహిత్ చివరి క్షణంలో రివ్యూ కోరాడు. థర్డ్ అంపైర్ బాల్ ట్రాకింగ్ చేయడంతో బంతి లెగ్ స్టంప్ బయట పిచ్ అయినట్లు తేలింది. దీంతో ఆన్-ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇక, సమస్య ఎక్కడ వచ్చిందంటే.. డీఆర్ఎస్ నిబంధనల ప్రకారం 15 సెకన్లలోపే రివ్యూ తీసుకోవాలి. అయితే, ఈ మ్యాచ్ లో రోహిత్ రివ్యూ కోరినప్పుడు టైమర్ 0 సెకన్లు చూపించింది. అంటే రివ్వ్యూ టైం కంప్లీట్ అయినా అంపైర్లు రోహిత్ రివ్యూ ఓకే చేశారు.
Read Also: GT vs SRH: మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్ రేసులో ఎస్ఆర్ఎచ్ నిలుస్తుందా? మొదట బ్యాటింగ్ చేయనున్న జీటి
కాగా, ఈ డ్రామా తర్వాత రోహిత్ శర్మ చెలరేగి ఆడాడు. 53 పరుగులతో ఈ ఐపీఎల్ మరో అద్భుతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఏకంగా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ముంబై టేబుల్ టాప్ లో కొనసాగుతుంది.
తాజావార్తలు
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..