MS Dhoni Retirement: ఎంఎస్ ధోనీ చివరి మ్యాచ్ ఆడనున్నాడా?.. చెపాక్లో ఎమోషనల్ ఫేర్వెల్?
- ఎంఎస్ ధోనీ అభిమానుల్లో మరోసారి ఉత్కంఠ
- ధోనీ రిటైర్మెంట్పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ
- ధోనీ చివరి మ్యాచ్ ఆడనున్నాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Is MS Dhoni To Play Last IPL Match for CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ముగింపుకు చేరుకుంటున్న సమయంలో క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ అభిమానుల్లో మరోసారి ఉత్కంఠ పెరిగింది. ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ఇంకా రెండు లీగ్ మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉండగా.. ధోనీ రిటైర్మెంట్పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ సీజన్ అనంతరం మహీ ఐపీఎల్కు గుడ్బై చెబుతాడని జోరుగా నెట్టింట ప్రచారం జరుగుతోంది. చెన్నై అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన చెపాక్ స్టేడియంలో ధోనీ తన చివరి మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు క్రికెట్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
హామ్స్ట్రింగ్ గాయం కారణంగా ఐపీఎల్ 2026లో సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇప్పటివరకు మైదనంలోకి దిగలేదు. గత సీజన్లో ఎదురైన మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఫిట్గా ఉన్నప్పటికీ.. మహీ ఇంకా మైదానంలోకి దిగకపోవడం అభిమానుల్లో అనేక సందేహాలకు తావిస్తోంది. మే 15న లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ధోనీ ఆడతాడని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ వరుసగా మూడు విజయాలతో అప్పటివరకు ప్లేఆఫ్స్ రేసులో ఉన్న జట్టు విన్నింగ్ కాంబినేషన్ను మార్చకూడదనే ఉద్దేశంతోనే తలా బరిలోకి దిగలేదని తెలుస్తోంది. అయితే ఆ మ్యాచ్లో లక్నో చేతిలో చెన్నై ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో ప్లేఆఫ్స్ రేసు మరింత సంక్లిష్టంగా మారింది.
Also Read
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ 'స్టాండప్ కామెడీ'.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
- Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
- SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
ఇక చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మే 18న సన్రైజర్స్ హైదరాబాద్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్లో ఎంఎస్ ధోనీ ఆడనున్నాడని తెలుస్తోంది. అంతేకాదు ఇదే మాహీకి చివరి మ్యాచ్ అని కూడా అంటున్నారు. ధోనీ రిటైర్మెంట్ కోసం సీఎస్కే మేనేజ్మెంట్ చెపాక్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు మే 18న ధోనీ సడన్ ఎంట్రీ ఇవ్వొచ్చని ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కూడా ఇందుకు ఊతమిస్తోంది. క్రిక్బజ్ చర్చలో పాల్గొన్న భోగ్లే మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ 2026లో చెన్నైలో సీఎస్కేకు ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఆ మ్యాచ్ మే 18న జరగనుంది. ఆ రోజు మొత్తం చెన్నై నగరం పసుపు రంగులో కళకళలాడినా ఆశ్చర్యపోను. హిచ్కాక్ స్టైల్లో అయినా ధోనీ ఒక్కసారిగా కనిపించినా ఆశ్చర్యం లేదు’ అని వ్యాఖ్యానించాడు.
హర్షా భోగ్లే చేసిన హిచ్కాక్ అపియరెన్స్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ధోనీ అకస్మాత్తుగా మైదానంలోకి వస్తే అభిమానులకు అది భారీ సర్ప్రైజ్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ధోనీ రిటైర్మెంట్పై ఇప్పటివరకు అటు సీఎస్కే నుంచి కానీ.. ఇటు మహీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఏదేమైనా ఇప్పుడు సీఎస్కే అభిమానుల దృష్టంతా మే 18 మ్యాచ్పైనే ఉంది. ధోనీ నిజంగా మైదానంలో కనిపిస్తాడా? లేదా? అన్న ఆసక్తి మరింత పెరిగింది.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!