MI vs LSG: రోహిత్ బాదినా.. ముంబైకి తప్పని ఓటమి! చివరి స్థానమే ఇక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Indians Close 10th Place in IPL 2024: ఐపీఎల్ 2024లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబై ఇండియన్స్.. ఈ సీజన్ను ఓటమితో ముగించింది. శుక్రవారం వాంఖడేలో లీగ్ ఆఖరి మ్యాచ్ ఆడిన ముంబై.. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిపోయింది. లక్నోపై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. పేలవ ప్రదర్శనతో ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ముంబై 14 మ్యాచ్లలో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి 8 పాయింట్ల ఖాతాలో వేసుకుంది. గత మూడు సీజన్లుగా ముంబై ప్లేఆఫ్స్ చేరని విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో 6 వికెట్లకు 214 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (75; 29 బంతుల్లో 5×4, 8×6) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ లోకేష్ రాహుల్ (55; 41 బంతుల్లో 3×4, 3×6) రాణించాడు. లక్నో మొదటి 10 ఓవర్లకు స్కోర్ 69/3 కాగా.. తర్వాతి 10 ఓవర్లలో ఏకంగా 145 పరుగులు రాబట్టింది. లక్నో స్కోరు 200 దాటిందంటే కారణం పూరన్. విధ్వంసక విన్యాసాలతో చెలరేగిపోయిన పూరన్.. ఎల్ఎస్జీకి ఊహించని స్కోరు అందించాడు. సిక్స్లు కొట్టడమే పని అన్నట్టుగా ఆడిన అతడు.. 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. పూరన్ ధాటికి లక్నో చివరి 5 ఓవర్లలో 90 పరుగులు రాబట్టింది. ముంబై బౌలర్లలో తుషార (3/28), చావ్లా (3/29) సత్తా చాటారు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: Gunfire : ఆఫ్ఘనిస్తాన్లో కాల్పులు కలకలం.. నలుగురి కాల్చివేత
భారీ ఛేదనలో ముంబై 196/6కే పరిమితమైంది. రోహిత్ శర్మ (68; 38 బంతుల్లో 10×4, 3×6), నమన్ ధీర్ (62 నాటౌట్; 28 బంతుల్లో 4×4, 5×6) పోరాటం సరిపోలేదు. దూకుడుగా రోహిత్ మంచి శుభారంభం అందించాడు. అయితే వర్షం రావడంతో మ్యాచ్ కాసేపు ఆగింది. మ్యాచ్ తిరిగి మొదలయ్యాక బ్రెవిస్ (23), సూర్యకుమార్ (0)తో పాటు రోహిత్ కూడా పెవిలియన్ చేరడంతో ముంబై వెనకపడిపోయింది. వికెట్లు పడుతూనే ఉండడంతో ఒత్తిడి పెరిగిపోయింది. ఆఖరి ఓవర్లో 34 పరుగులు అవసరం కాగా.. ముంబై 15 పరుగులే చేయగలిగింది. రవి బిష్ణోయ్ (2/37) రాణించాడు.
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!