Manish Pandey: వర్షం వచ్చినా, ఎండ ఉన్నా ఆగం.. కేకేఆర్ హీరో మనీష్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు!
- ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో కోల్కతా విజయం
- మనీష్ పాండేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
- కేకేఆర్ ఎప్పుడూ నాకు ఎంతో చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా ముంబై 8 వికెట్లకు 147 పరుగులే చేయగా.. కోల్కతా 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్షాన్ని ఛేదించింది. కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించిన మనీష్ పాండే (45; 33 బంతుల్లో 6×4)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన మనీష్.. కేకేఆర్తో తన అనుబంధం, జట్టులో అవకాశాలు రాకపోయినా మోటివేషన్ కోల్పోకుండా ఎలా ముందుకు సాగాడో భావోద్వేగంగా వివరించాడు. 2014లో కేకేఆర్ టైటిల్ గెలిచిన జట్టులో భాగమైన మనీష్.. 2024 తర్వాత మళ్లీ జట్టులో కీలక పాత్ర పోషించడం ప్రత్యేకంగా నిలిచింది.
2014, 2024లో కోల్కతాకు చాలా చేశారు అనే ప్రశ్నకు మనీష్ పాండే మాట్లాడుతూ… ‘బహుశా అందుకే నేను ఇంకా ఇక్కడ ఉన్నానేమో. కేకేఆర్ ఎప్పుడూ నాకు ఎంతో చేసింది. ఈ సీజన్ ప్రారంభం నుంచి చూస్తే.. నేను బ్యాటింగ్ చేసిన మ్యాచ్ ఇదే. మొదటి నాలుగు మ్యాచ్ల్లో కూడా ప్యాడ్స్ కట్టుకుని రెడీగా ఉన్నా కానీ.. అవకాశం రాలేదు. కానీ ఈ మ్యాచ్ మాత్రం నాకు ఎంతో ప్రత్యేకం. క్రీజులో ఎక్కువసేపు ఉండి జట్టును గెలిపించాలనుకున్నా. అదృష్టవశాత్తూ అదే జరిగింది. మధ్యలో రోవ్మన్ పావెల్తో కలిసి నిర్మించిన భాగస్వామ్యం జట్టుకు ఎంతో ఉపయోగపడింది. కొన్ని మంచి పార్ట్నర్షిప్స్ వచ్చాయి. అదే మా విజయానికి కారణమైంది. మిగిలిన మ్యాచ్లో కూడా ఇదే విధంగా ఆడి జట్టును టాప్-4లోకి తీసుకెళ్లాలని ఆశిస్తున్నా’ అని అన్నాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
తన ఇన్నింగ్స్లో గుర్తుండిపోయిన షాట్ల గురించి అడగగా.. జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్ వేసిన లెంగ్త్ బాల్స్పై కొట్టిన కొన్ని ఫోర్లు ప్రత్యేకంగా అనిపించాయని మనీష్ పాండే చెప్పాడు. ‘ఆ సమయంలో నేను బాగా బ్యాటింగ్ చేస్తున్నానని అనిపించింది. అందుకే క్రీజులో ఎక్కువసేపు ఉండాలని భావించా. నేను ఆడకపోయినా జట్టులో భాగంగా ఉండాలని ఎప్పుడూ భావిస్తాను. ఎజట్టుకు అవసరమైతే ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. ఈ సీజన్ మొత్తం అదే చేశాను. మా జట్టులో యువ ఆటగాళ్లు, సీనియర్లు అందరూ మంచి స్నేహపూర్వక వాతావరణంలో ఉన్నారు. అదే మమ్మల్ని మళ్లీ బలంగా తిరిగి వచ్చేలా చేస్తోంది’ అని చెప్పుకొచ్చాడు.
ఫీల్డింగ్పై తాను కష్టపడే విధానం గురించి కూడా మనీష్ పాండే వివరించాడు. ‘మేము రోజూ గంటసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తే.. దాదాపు 45 నిమిషాలు ఫీల్డింగ్కే కేటాయిస్తాం. వర్షం వచ్చినా, ఎండ ఉన్నా అస్సలు ఆగం. నేను బౌలింగ్ చేయను కాబట్టి ఫీల్డింగ్ను చాలా ఎంజాయ్ చేస్తాను. ఒక్క రన్ సేవ్ చేయడం నుంచి అద్భుత క్యాచ్లు పట్టడం వరకు జట్టుకు ఉపయోగపడాలని కోరుకుంటాను. ఫీల్డింగ్లో బంతి నా వైపే రావాలని ఎప్పుడూ అనిపిస్తుంది. జట్టుకు ఏ విధంగానైనా నా వంతు సాయం చేయడం గర్వంగా ఉంటుంది. అదే నన్ను ముందుకు నడిపిస్తోంది’ అని మనీష్ పాండే చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!