Vaibhav Sooryavanshi: “సిక్సర్ల సునామీ”.. ఫస్ట్ బాల్కే ప్రపంచ రికార్డు బద్దలుగొట్టిన వైభవ్ సూర్యవంశీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు ఒక సంచలనంగా మారింది. రికార్డులను తిరగరాయడమే పనిగా పెట్టుకున్న ఈ 15 ఏళ్ల కుర్రాడు, రోజు రోజుకూ కొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన భారతీయ ప్లేయర్గా గుర్తింపు పొందిన సూర్యవంశీ, తాజాగా మరో అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 40 బంతుల కంటే తక్కువ వ్యవధిలో రెండు ఐపీఎల్ సెంచరీలు (2025లో గుజరాత్ టైటాన్స్పై 35 బంతుల్లో, 2026లో సన్రైజర్స్ హైదరాబాద్పై 36 బంతుల్లో) బాదిన ఏకైక బ్యాటర్గా నిలిచాడు. ఇక, శనివారం నాటి మ్యాచ్లో మహమ్మద్ సిరాజ్ వేసిన తొలి బంతికే సిక్స్ కొట్టి టీ20ల్లో వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. కేవలం 514 బంతుల్లోనే ఈ ‘సిక్సర్ల సెంచరీ’ మార్కును అందుకోవడం విశేషం. అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా వైభవ్ చరిత్రకెక్కాడు.
రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఈ మ్యాచ్లో వైభవ్ 16 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. విశేషమేమిటంటే, ఈ మూడు సిక్సర్లు పవర్ప్లేలోనే వచ్చాయి. దీనితో ఒక ఐపీఎల్ సీజన్లో పవర్ప్లే (1-6 ఓవర్లు)లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా వైభవ్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం 30 సిక్సర్లతో అతను అగ్రస్థానంలో ఉండగా, అభిషేక్ శర్మ (2024లో 29 సిక్సర్లు, 2026లో 27 సిక్సర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాడు. గతంలో సనత్ జయసూర్య (2008), ట్రావిస్ హెడ్ (2024), యశస్వి జైస్వాల్ (2025) తలో 22 సిక్సర్లతో ఈ జాబితాలో ఉండేవారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
మరోవైపు, జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన నిన్నటి పోరులో గుజరాత్ టైటాన్స్ పరుగుల వరద పారించింది. గాయపడిన రియాన్ పరాగ్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించిన యశస్వి జైస్వాల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 44 బంతుల్లో 84 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, సాయి సుదర్శన్ (36 బంతుల్లో 55) రాణించాడు. చివరలో వాషింగ్టన్ సుందర్ (20 బంతుల్లో 37) మెరుపులు మెరిపించడంతో గుజరాత్ స్కోరు 200 దాటింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ 16.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Rafale vs J-16: రఫేల్తో చైనీస్ J-16 పోరాటం.. నిశితంగా గమనిస్తున్న భారత్..
-
Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
-
PM Modi: ప్రధాని మోడీ పేరుతో సూరత్లో చేపల మార్కెట్.. గుజరాత్లో కొత్త వివాదం
-
Bandi Sanjay : ఫీజు బకాయిలపై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్కు డెడ్లైన్.!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!