Viral: బిగ్ షాకింగ్… స్నానం చేస్తున్న మహిళల వీడియోలు తీసి దొరికిన స్టార్ క్రికెటర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక క్రికెట్ ఇప్పటికే పరిపాలనాపరమైన మార్పులతో సతమతమవుతుండగా, తాజాగా అండర్-19 జట్టుకు చెందిన ఇద్దరు యువ క్రీడాకారులు చేసిన పని ఆ దేశ క్రీడారంగానికి తీరని మచ్చ తెచ్చింది. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన క్రీడాకారులు, సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
కొలంబోలోని నారాహెన్పిటా ప్రాంతంలో ఉన్న ఒక హోటల్లో బస చేసిన ఇద్దరు శ్రీలంక అండర్-19 పురుషుల క్రికెటర్లు, హోటల్లోని ఇతర అతిథులు స్నానం చేస్తుండగా రహస్యంగా చిత్రీకరించారనే ఆరోపణలపై అరెస్టయ్యారు. హోటల్లో ఉంటున్న మహిళలు, తాము స్నానం చేస్తుండగా తమను మొబైల్ ఫోన్ల ద్వారా వీడియో తీస్తున్నారని గుర్తించి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
కోర్టు విచారణ..
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరిపి.. ఈ వారం మొదట్లో ఆ ఇద్దరు క్రికెటర్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అలుత్కాడె మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి ఒక్కొక్కరికి 5,00,000 శ్రీలంక రూపాయల (సుమారు 1,564 డాలర్లు) వ్యక్తిగత బాండ్లపై బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణ మే 25న జరగనుంది.
పోలీసుల దర్యాప్తు..
నారాహెన్పిటా పోలీసులు ప్రస్తుతం ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. ముఖ్యంగా సదరు క్రీడాకారులు చిత్రీకరించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లోగానీ లేదా ఇతరులకు గానీ షేర్ చేశారా అనే కోణంలో ఫోరెన్సిక్ తనిఖీలు చేస్తున్నారు.
శ్రీలంక క్రికెట్ బోర్డు స్పందన..
ఈ వివాదంపై శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) ఇంకా ఎలాంటి అధికారిక క్రమశిక్షణ చర్యలను ప్రకటించలేదు. అయితే.. గత 48 గంటల్లో బోర్డులో భారీ మార్పులు జరగడం విశేషం. పాత ఆఫీస్ బేరర్లను తొలగించి, వారి స్థానంలో ఒక ‘ట్రాన్స్ఫర్మేషన్ కమిటీ’ని నియమించారు. ఈ పరిపాలనాపరమైన మార్పుల నేపథ్యంలో, నిందితులైన ఆటగాళ్లపై బోర్డు ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందో చూడాలి.
సాధారణంగా అండర్-19 స్థాయిలో ఉన్న క్రీడాకారులకు భవిష్యత్తులో జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి నేరారోపణలు ఎదుర్కోవడం వల్ల వారి కెరీర్ ముగిసిపోయే ప్రమాదం ఉంది. గతంలో కూడా పలువురు శ్రీలంక క్రికెటర్లు క్రమశిక్షణా రాహిత్యం వల్ల నిషేధానికి గురయ్యారు. తాజా ఘటనతో క్రీడాకారుల ప్రవర్తనా నియమావళిని మరింత కఠినతరం చేయాలని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం..
-
Ajit Doval: ‘పహల్గామ్ దాడి తర్వాత మోడీ అడిగిన ప్రశ్న ఇదే’.. అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు
-
Bolla Kiran : గంజాయి ముఠా గుట్టురట్టు.. బొల్లా కిరణ్ దారుణాలు వెలుగులోకి..
-
Football Club: సంచలనం.. రూ.100కే ఫుట్బాల్ క్లబ్ అమ్మకం..
-
BRICS Summit: ఉద్రిక్తతల వేళ.. భారత్కు ఇరాన్ అధ్యక్షుడు..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!