Cricket Love Storie: 22 ఏళ్ల ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్.. 29 ఏళ్ల ఆ స్పోర్ట్స్ యాంకర్ మధ్య ఏం జరుగుతోంది.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cricket Love Storie: క్రికెట్ ప్లేయర్స్కు సంబంధించిన లవ్ స్టోరీలు బాగా వైరల్ అవుతుంటాయి. ప్లేయర్స్ పర్ఫామెన్స్ కంటే వీటిపైనే కొంత మంది ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు. అలాంటి ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున యువ ఆల్ రౌండర్ సమీర్ రిజ్వీ నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పుడు మైదానంలో తన ఆట కంటే బయట ఓ వివాదం కారణంగా వార్తల్లో నిలిచాడు రిజ్వీ. ప్రముఖ ఇండో-కెనడియన్ స్పోర్ట్స్ యాంకర్ యెషా సాగర్తో రిజ్వీ ప్రేమాయణంలో ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక వీరి వయసు విషయానికి వస్తే.. సమీర్ రిజ్వీ 22 ఏళ్లు కాగా.. యెషా సాగర్కు 29 ఏళ్లు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ ముస్లిం క్రికెటర్, లీగ్ బ్రాడ్కాస్టింగ్ విభాగంలో పనిచేస్తున్న ఒక హిందూ స్పోర్ట్స్ యాంకర్తో ప్రేమలో ఉన్నాడు. కానీ ఆ సంబంధంలో కొన్ని వ్యక్తిగత, మతపరమైన అంశాలకు సంబంధించిన ఒత్తిళ్లు ఉన్నాయని ఓ జర్నలిస్ట్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్ట్ ఈ చర్చకు దారితీసింది.
సదరు జర్నలిస్ట్ తన పోస్ట్లో ఎవరి పేర్లను నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఆ యాంకర్ స్నేహితురాలి ద్వారా తెలిసిన సమాచారం అంటూ కొన్ని సంచలన విషయాలను పేర్కొన్నారు. ఆ క్రికెటర్ తన వ్యక్తిగత ఇష్టాఇష్టాలను ఆ యాంకర్పై రుద్దుతున్నాడు. సోషల్ మీడియాలో ఆమె ప్రవర్తన, ఇతరులతో సామాజిక సంబంధాలపై కొన్ని ఆంక్షలు సైతం విధించాడని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారం పరస్పర అంగీకారంతో జరుగుతోందా లేదా అన్నది సంబంధిత వ్యక్తులు స్పందిస్తేనే తెలుస్తుందని ఆ జర్నలిస్ట్ వెల్లడించారు. ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. అటు సమీర్ రిజ్వీ కానీ, ఇటు యేషా సాగర్ కానీ ఈ విషయంపై ఇప్పటివరకు ఎటువంటి బహిరంగ ప్రకటన చేయలేదు.
Also Read
- Chris Gayle: అబ్బబ్బా ఏం ఆడుతున్నాడు, వైభవ్కు అభిమానిగా మారిపోతున్నా.. యూనివర్స్ బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- MS Dhoni: ఎంఎస్ ధోనీ క్రేజ్ చూసి పిచ్చెక్కిపోయింది.. మహీ చిరకాల ప్రత్యర్థి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Justin Langer: ఇప్పుడే ఇలా ఆడుతుంటే, అప్పటికి ఊహించలేం.. వైభవ్తో ప్రపంచ క్రికెట్కు వణుకే!
- Vaibhav Sooryavanshi: వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్కు ప్రత్యర్థి ఓనర్ కూడా ఫిదా.. బుడ్డోడి కోసం వచ్చే ఏడాది బిడ్ ఖాయం!
ఇక, ప్రస్తుతం సమీర్ రిజ్వీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 149.28 స్ట్రైక్ రేట్తో రెండు హాఫ్ సెంచరీల సాయంతో 209 పరుగులు చేసి మంచి ఫామ్లో ఉన్నాడు. 2024లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన రిజ్వీ, మొత్తం 21 మ్యాచ్లలో 381 పరుగులు సాధించాడు. మే 1వ తేదీ శుక్రవారం నాడు జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరగనున్న తదుపరి మ్యాచ్కు ఢిల్లీ జట్టు సిద్ధమవుతుండగా, బయట వినిపిస్తున్న ఈ రూమర్లు సమీర్ రిజ్వీని ఇబ్బందుల్లోకి నెట్టేలా కనిపిస్తున్నాయి. కేవలం సోషల్ మీడియా ప్రచారం ఆధారంగానే ఈ వార్తలు వస్తున్నందున, ఇందులో నిజమెంత ఉందనేది వేచి చూడాలి.
తాజావార్తలు
-
WFH: ఆ బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త.. వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రం హోం..
-
Chiranjeevi : ఏపీసెట్ టాపర్ రుషి.. కలను నిజం చేసి, ల్యాప్టాప్ బహుకరించిన మెగాస్టార్
-
Weather Updates : తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
RRB Technician 2026: నిరుద్యోగులకు గోల్డెన్ చాన్స్.. రైల్వేలో 6,565 టెక్నీషియన్ పోస్టులు.. దరఖాస్తు, అర్హత పూర్తి వివరాలు
-
Sharad Pawar: విదేశీ పర్యటనలతో దేశ ప్రతిష్టతను కాపాడుతున్నారు.. మోడీపై శరద్పవార్ ప్రశంసలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!