Mumbai Indians: రోహిత్ నిరాశ.. హార్దిక్ నిరుత్సాహం.. బుమ్రా నిస్సహాయత.. ముంబైలో అంతా గందరగోళం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Indians in Crisis: ఈ సీజన్లో ముంబై ఇండియన్స్(MI) జట్టులో ఏ ఒక్క ఆటగాడు సంతోషంగా లేడు. రోహిత్ శర్మ గాయపడటం, జస్ప్రీత్ బుమ్రా వికెట్ల కోసం తడబడుతున్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా పరిస్థితి సైతం చాలా యాతన అనుభవిస్తున్నాడు. తన ప్రధాన అస్త్రాలైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవడంతో డీలా పడిపోయాడు. ఇక నిన్న జరిగిన మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ సేనను అడ్డుకోవడంలో ముంబై ఘోరంగా విఫలమైంది. నిన్నటి పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ప్లేయర్ సహనం కోల్పోయారు. భావోద్వేగాలు సైతం అదుపు తప్పాయి. హార్దిక్ ఫీల్డింగ్ సెట్ చేయడంలో రోహిత్ కోపంగా కనిపించాడు. మరోవైపు.. బుమ్రా ముఖంలో నిరాశ స్పష్టంగా కనిపించింది. అసలు 12 మంది సభ్యుల బృందంలో లేకపోయినప్పటికీ, డగౌట్ నుంచి మ్యాచ్ను వీక్షిస్తున్న రోహిత్ తన అసంతృప్తిని దాచుకోలేకపోయాడు. మ్యాచ్ మధ్యలో ప్రభ్సిమ్రాన్ సింగ్ ఇచ్చిన క్యాచ్ను బుమ్రా వదిలేయడంతో కెప్టెన్ హార్దిక్ తీవ్రంగా కోపగించుకున్నాడు. బుమ్రా క్షమాపణలు కోరినప్పటికీ.. ఆ తర్వాత బౌలింగ్లో అద్భుతాలు చేయలేకపోయాడు. అదే ఫీలింగ్లో ఉండిపోయినట్లు కనిపించింది.
READ MORE: Samrat Choudhary: బీహార్ కొత్త ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి బెదిరింపులు.. ఒకరు అరెస్ట్
Also Read
- Rohit Sharma Lady Fan: అభిమాని కోసం వెయిట్ చేసిన రోహిత్ శర్మ.. తబ్బిబైపోయిన యువతి, వీడియో వైరల్!!
- Rohit Sharma Watch: రూ.3.25 కోట్ల రోహిత్ శర్మ వాచ్ను దొంగిలించాలని చూసిన అభిమాని.. వీడియో వైరల్!
- Rohit Sharma TV Show: రెండు లైన్లకే ఇంత వైరల్ అయితే.. మొత్తం షో రిలీజ్ అయితే ఇంకెంత రచ్చ అవుతుందో!
- KKR Playoffs Scenario: అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న కేకేఆర్.. ప్లేఆఫ్స్ సమీకరణాలు ఇవే!
వరుస ఓటముల నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర అనహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం చెప్పడానికి ఏమీ మిగల్లేదని విచారం వ్యక్తం చేశాడు. “నిజం చెప్పాలంటే ఇప్పుడు మాట్లాడటానికి మాటలు రావడం లేదు. మళ్ళీ మొదటి నుంచి అన్నీ సమీక్షించుకోవాలి. లోపం ఎక్కడ ఉందో వెతకాలి.. అది వ్యక్తిగత ప్రదర్శనలోనా? జట్టు వ్యూహాల్లోనా? అనేది తేల్చాలి” అని హార్దిక్ అన్నాడు. రాబోయే మ్యాచ్ల్లో జట్టులో భారీ మార్పులు ఉంటాయని, కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని హింట్ సైతం ఇచ్చేశాడు. ఇక టీమ్లోని జట్టులో ఉన్న స్టార్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శార్దూల్ ఠాకూర్, ట్రెంట్ బౌల్ట్ వంటి స్టార్ ప్లేయర్లు తమ స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే వీరిని రిజర్వ్ బెంచ్కు పరిమితం చేయక తప్పదని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోందట. ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై, ఈ సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కుతుందో చూడాలి.
తాజావార్తలు
-
OTT Releases This Week: ఈ వారం సౌత్ ఓటీటీ మూవీస్ అన్నీ భలే ఉన్నాయే!
-
Trisha – Vijay : త్రిష వల్లే విజయ్’కు ఇన్ని ఇబ్బందులా?
-
Vladimir Putin: పుతిన్కు ప్రాణగండం? రష్యాలో సైనిక తిరుగుబాటుకు స్కెచ్!
-
Kakarla Krishna : టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నిర్మాత కన్నుమూత!
-
RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్