Mumbai Indians: ఓటమిలోనూ వరల్డ్ రికార్డ్.. టీ20 క్రికెట్ చరిత్రలో తొలి జట్టుగా ముంబై ఇండియన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Indians Create History: ఐపీఎల్లో ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ పరిస్థితి ఈ సీజన్లో దారుణంగా మారింది. శనివారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఘోర పరాజయం పాలైంది. అయితే.. ఈ పరాజయంలోనూ ముంబై ఇండియన్స్ ఓ వరల్డ్ రికార్డ్ను సృష్టించింది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. టీ20 క్రికెట్ చరిత్రలో 50,000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి జట్టుగా ముంబై ఇండియన్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ అరుదైన ఘనత సాధించడానికి ముంబైకి ఈ మ్యాచ్లో 114 పరుగులు అవసరం కాగా, 15వ ఓవర్లో ఆ మైలురాయిని చేరుకుంది.
ముంబై ఇండియన్స్కు ఇది 308వ టీ20 మ్యాచ్ (286 ఐపీఎల్ మ్యాచ్లు, 22 ఛాంపియన్స్ లీగ్ టీ20 మ్యాచ్లు). టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జట్ల జాబితాలో ముంబై తర్వాత ఇంగ్లండ్కు చెందిన సోమర్సెట్ (48,244 పరుగులు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (47,304 పరుగులు), చెన్నై సూపర్ కింగ్స్ (46,438 పరుగులు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో రోహిత్ శర్మ (6,286 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా, సూర్యకుమార్ యాదవ్ (3,933), కీరన్ పొలార్డ్ (3,915) తర్వాతి స్థానాల్లో నిలిచారు.
Also Read
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
- Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
అయితే, ఈ చారిత్రాత్మక రికార్డు ముంబైకి తీపి జ్ఞాపకాన్ని మిగిల్చినా, మ్యాచ్ ఫలితం మాత్రం చేదుగా మారింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేయగా, చెన్నై సూపర్ కింగ్స్ కేవలం 18.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రుతురాజ్ గైక్వాడ్ (67), కార్తీక్ శర్మ (54) అర్ధసెంచరీలతో చెన్నైకి విజయాన్ని అందించారు. ఈ ఓటమితో ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబైకి ఇది అత్యంత కీలకమైన మ్యాచ్. ప్రస్తుతం 8 మ్యాచ్లలో కేవలం 4 పాయింట్లతో ఉన్న ముంబై, మిగిలిన 6 మ్యాచ్ల్లోనూ గెలిస్తే గరిష్టంగా 16 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉండేది. కానీ చెన్నై చేతిలో ఓటమితో ఇప్పుడు ముంబై గరిష్టంగా 14 పాయింట్లను మాత్రమే సాధించగలదు, ఇది ప్లేఆఫ్స్ రేసులో నిలవడానికి సరిపోదు.
తాజావార్తలు
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!