SRH Vs RCB: ఉప్పల్లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకున్న తరుణంలో ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఒక హై-వోల్టేజ్ పోరుకు సిద్ధమైంది. సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకంగా మారింది. ముఖ్యంగా హోం గ్రౌండ్లో ఆడుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్లో ఆర్సీబీపై భారీ విజయాన్ని నమోదు చేయడం ద్వారా పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానాన్ని దక్కించుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. టాప్-2లో నిలిస్తే ప్లేఆఫ్స్లో క్వాలిఫయర్-1 ఆడే అవకాశం దక్కుతుంది కాబట్టి.. సన్రైజర్స్ ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది.
ఈ ఐపీఎల్ సీజన్లో ఉప్పల్ మైదానంలో ఆరెంజ్ ఆర్మీకి ఇదే చివరి హోమ్ మ్యాచ్ కావడంతో, ఈ మ్యాచ్ను మరింత ప్రత్యేకంగా మార్చాలని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ యాజమాన్యం తమ అభిమానుల కోసం సామాజిక మాధ్యమాల ద్వారా ఒక ప్రత్యేకమైన అభ్యర్థన చేసింది. సీజన్ పొడవునా తమకు ఎంతో అండగా నిలిచి, ప్రతి మ్యాచ్లోనూ స్టేడియంకు వచ్చి భారీగా మద్దతు ప్రకటించిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలపాలని జట్టు నిర్ణయించింది.
Also Read
- Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav's Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
- Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
మ్యాచ్ ముగిసిన వెంటనే స్టేడియం వదిలి వెళ్లకుండా అభిమానులందరూ తమ స్టాండ్స్లోనే వేచి ఉండాలని యాజమాన్యం కోరింది. మ్యాచ్ అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ అంతా కలిసి మైదానం చుట్టూ తిరుగుతూ ధన్యవాదాలు తెలియజేసే “వన్ లాస్ట్ ల్యాప్ సెరమనీ” నిర్వహించనున్నారు.
ఈ ప్రత్యేక వేడుక ద్వారా ఈ సీజన్ అంతా లభించిన అపారమైన ప్రేమాభిమానాలకు ఆటగాళ్లు నేరుగా స్పందించనున్నారు. కాబట్టి మైదానానికి వచ్చే ప్రతి ఒక్కరు ఈ అద్భుతమైన క్షణాలను వీక్షించాలని, అలాగే ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ స్టాండ్స్లోనే ఉండి జట్టుకు వీడ్కోలు పలకాలని ఎస్ఆర్హెచ్ కోరింది. ఉప్పల్ స్టేడియం ఆరెంజ్ మయంగా మారనున్న ఈ మ్యాచ్ అటు ఆటపరంగా, ఇటు అభిమానుల సెంటిమెంట్ పరంగా ఎంతో ఆసక్తికరంగా మారనుంది.
తాజావార్తలు
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
-
Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!