SRH Vs RCB: ఉప్పల్లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకున్న తరుణంలో ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఒక హై-వోల్టేజ్ పోరుకు సిద్ధమైంది. సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకంగా మారింది. ముఖ్యంగా హోం గ్రౌండ్లో ఆడుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్లో ఆర్సీబీపై భారీ విజయాన్ని నమోదు చేయడం ద్వారా పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానాన్ని దక్కించుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. టాప్-2లో నిలిస్తే ప్లేఆఫ్స్లో క్వాలిఫయర్-1 ఆడే అవకాశం దక్కుతుంది కాబట్టి.. సన్రైజర్స్ ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది.
ఈ ఐపీఎల్ సీజన్లో ఉప్పల్ మైదానంలో ఆరెంజ్ ఆర్మీకి ఇదే చివరి హోమ్ మ్యాచ్ కావడంతో, ఈ మ్యాచ్ను మరింత ప్రత్యేకంగా మార్చాలని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ యాజమాన్యం తమ అభిమానుల కోసం సామాజిక మాధ్యమాల ద్వారా ఒక ప్రత్యేకమైన అభ్యర్థన చేసింది. సీజన్ పొడవునా తమకు ఎంతో అండగా నిలిచి, ప్రతి మ్యాచ్లోనూ స్టేడియంకు వచ్చి భారీగా మద్దతు ప్రకటించిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలపాలని జట్టు నిర్ణయించింది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
మ్యాచ్ ముగిసిన వెంటనే స్టేడియం వదిలి వెళ్లకుండా అభిమానులందరూ తమ స్టాండ్స్లోనే వేచి ఉండాలని యాజమాన్యం కోరింది. మ్యాచ్ అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ అంతా కలిసి మైదానం చుట్టూ తిరుగుతూ ధన్యవాదాలు తెలియజేసే “వన్ లాస్ట్ ల్యాప్ సెరమనీ” నిర్వహించనున్నారు.
ఈ ప్రత్యేక వేడుక ద్వారా ఈ సీజన్ అంతా లభించిన అపారమైన ప్రేమాభిమానాలకు ఆటగాళ్లు నేరుగా స్పందించనున్నారు. కాబట్టి మైదానానికి వచ్చే ప్రతి ఒక్కరు ఈ అద్భుతమైన క్షణాలను వీక్షించాలని, అలాగే ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ స్టాండ్స్లోనే ఉండి జట్టుకు వీడ్కోలు పలకాలని ఎస్ఆర్హెచ్ కోరింది. ఉప్పల్ స్టేడియం ఆరెంజ్ మయంగా మారనున్న ఈ మ్యాచ్ అటు ఆటపరంగా, ఇటు అభిమానుల సెంటిమెంట్ పరంగా ఎంతో ఆసక్తికరంగా మారనుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?