IPL 2026: ‘వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో’.. ఆ ఆటగాడిపై తీవ్ర ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరిగిన మ్యాచ్లో యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ ప్రదర్శనపై వస్తున్న విమర్శలను ప్రముఖ వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ ఖండించారు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఐపీఎల్, యువ ప్రతిభను వెలికితీయడంలో ఎప్పుడూ ముందుంటుంది. 2024 సీజన్లో తన బుల్లెట్ వేగంతో అందరినీ ఆశ్చర్యపరిచిన మయాంక్ యాదవ్, ఆ తర్వాత గాయాల బారిన పడి దాదాపు 353 రోజుల పాటు మైదానానికి దూరమయ్యాడు. తీవ్రమైన వెన్నునొప్పితో కెరీర్ ప్రమాదంలో పడిన తరుణంలో.. ఎంతో కష్టపడి కోలుకుని రాజస్థాన్తో జరిగిన మ్యాచ్ ద్వారా మళ్లీ ఐపీఎల్ బరిలోకి దిగాడు.
ఈ మ్యాచ్లో మయాంక్ యాదవ్ తన పూర్తి కోటా 4 ఓవర్లు వేసి 56 పరుగులు ఇచ్చాడు. దురదృష్టవశాత్తూ అతనికి ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ముఖ్యంగా తన చివరి ఓవర్లో రవీంద్ర జడేజా బ్యాటింగ్లో 20 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు అతడిపై విమర్శల వర్షం కురిపించారు. వికెట్లు తీయకుండా ఇన్ని పరుగులు ఇస్తావా అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. అంతే కాదు ఇంకొంతమంది నెటిజన్లు ‘నీకు బౌలింగ్ రాదు.. వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో’ అంటూ విమర్శిస్తున్నారు.
Also Read
- ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
- T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
- Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
- Shreyas Iyer IPL Record: శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో 'ఒకే ఒక్కడు'!
ఇయాన్ బిషప్ అండ..
ఈ విమర్శలపై వెస్టిండీస్ మాజీ దిగ్గజం ఇయాన్ బిషప్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఘాటుగా సమాధానమిచ్చారు. “మయాంక్ యాదవ్పై వస్తున్న నెగెటివ్ కామెంట్లను చూడటం భయానకంగాఉంది. 21 ఏళ్ల వయసులో అతడు దాదాపు తన కెరీర్ను, జీవనోపాధిని కోల్పోయే స్థితికి వెళ్ళాడు. అలాంటి పరిస్థితుల నుంచి కోలుకుని మళ్ళీ మైదానంలోకి రావడం పెద్ద విషయం. అతడు మళ్ళీ 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలగడం ఒక అద్భుతం. ప్రస్తుతం అతడు ఫిట్గా ఉండాలని కోరుకోండి, లైన్ అండ్ లెంగ్త్పై నియంత్రణ మెల్లగా వస్తుంది” అని బిషప్ అతడికి మద్దతుగా నిలిచారు.
తాజావార్తలు
-
Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
-
ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
-
Tollywood : పర్సంటేజ్’ స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
-
Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!