Anushka Sharma: RCB ఫైనల్ చేరడంలో అనుష్క శర్మ పాత్ర కూడా.. ఆ రింగ్ స్పెషాలిటీ ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ (విరుష్క) జంటకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పెళ్లయి ఇన్నేళ్లయినా ఈ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో తన భర్త విరాట్ కోహ్లీని, ఆర్సీబీ టీమ్ను ఉత్సాహపరచడానికి అనుష్క శర్మ మైదానానికి వచ్చారు. అయితే.. మ్యాచ్ సమయంలో గ్యాలరీలో కూర్చున్న ఆమె వేలికి ఉన్న ఒక వింత ఉంగరం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
ఆధ్యాత్మికతతో కూడిన లేటెస్ట్ గాడ్జెట్..
సాధారణ దుస్తుల్లో మెరిసిన అనుష్క శర్మ, మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్నంత సేపు ఆర్సీబీ విజయం కోసం ప్రార్థిస్తూ కనిపించారు. ఈ క్రమంలో ఆమె చూపుడు వేలికి ఉన్న డిజిటల్ రింగ్ కెమెరాల కంటికి చిక్కింది. నెటిజన్లు దీని గురించి ఆరా తీయగా.. అది కేవలం ఒక అందమైన నగ మాత్రమే కాదు, అంతకు మించిన ఉపయోగం ఉన్న ఒక లేటెస్ట్ గాడ్జెట్ అని తేలింది. దీనిని ‘రాధా నామ్ జప కౌంటర్ రింగ్’ లేదా ‘డిజిట్ జప మాల’ అని పిలుస్తారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
ఇలా పనిచేస్తుంది..
సాధారణంగా దేవుడి నామాన్ని లేదా మంత్రాలను జపించడానికి రుద్రాక్షలు, స్ఫటిక మాలలను వాడుతుంటారు. కానీ ప్రయాణాల్లో, బహిరంగ ప్రదేశాల్లో అది కుదరదు. అందుకే ఈ ఆధునిక సాంకేతిక పరికరాన్ని ఉపయోగిస్తారు. దీనిని వేలికి ఉంగరంలా ధరించి, ప్రతిసారి మంత్రాన్ని పఠించినప్పుడు అందులోని బటన్ను నొక్కితే చాలు.. ఎన్ని సార్లు జపించామో అనే సంఖ్య దానికి ఉన్న చిన్న డిజిటల్ స్క్రీన్పై కనిపిస్తుంది. ఆన్లైన్ మార్కెట్లో ఇది కేవలం రూ.150 నుంచి రూ.200 ధరలోనే లభిస్తుంది.
ఆధ్యాత్మిక మార్గంలో ‘విరుష్క’ జంట…
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ ప్రేమానంద్ జీ మహారాజ్ దీవెనలతో రాధావల్లభ సంప్రదాయాన్ని అమితంగా విశ్వసించే విరాట్, అనుష్కలు ఈ మధ్యకాలంలో పూర్తి ఆధ్యాత్మిక భక్తులుగా మారిపోయారు. గతంలో బృందావనం సందర్శించినప్పుడు విరాట్ కోహ్లీ చేతిలో కూడా ఇలాంటి జప కౌంటర్ కనిపించింది. తాజాగా జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ గెలిచి ఫైనల్కు చేరాలంటూ అనుష్క ఈ రింగ్తో మైదానంలోనే ‘రాధా నామ జపం’ చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా భర్త విజయం కోసం అనుష్క చేసిన ఈ డిజిటల్ జపం ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
తాజావార్తలు
-
Bhagyasri Borse : ఏడ్చేసిన ‘లెనిన్’ హీరోయిన్.. అండగా నిలబడ్డారంటూ భాగ్యశ్రీ కన్నీళ్లు!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
-
Train Accident: లోకో పైలట్ అప్రమత్తత.. తప్పిన రైలు ప్రమాదం
-
Akkineni Akhil : నా వల్ల సినిమా దెబ్బ తింటుందేమోనని భయపడ్డాను!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!