MS Dhoni Return: వాంఖడేలో హై వోల్టేజ్ పోరు.. సీఎస్కేకు గుడ్ న్యూస్, దిగ్గజం దిగుతున్నాడు!
- గురువారం వాంఖడేలో హై వోల్టేజ్ పోరు
- గెలుపే లక్ష్యంగా బరిలోకి ఎంఐ, సీఎస్కే
- సీఎస్కేకు గుడ్ న్యూస్, దిగ్గజం దిగుతున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni Likely Return for MI vs CSK Clash in IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడేలో హై వోల్టేజ్ పోరుకు రంగం సిద్దమైంది. గురువారం ముంబై ఇండియన్స్ (ఎంఐ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో రెండు టీమ్స్ దిగువన ఉండడంతో.. ఈ మ్యాచ్ కీలకంగా మారింది. గెలిచిన టీమ్ ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ఓడిన జట్టుకు మాత్రం ఆశలు సన్నగిల్లుతాయి. ఈ నేపథ్యంలో ఎంఐ, సీఎస్కేలు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ముంబైతో కీలక పోరుకు ముందు చెన్నైకి ఓ గుడ్ న్యూస్. మాజీ కెప్టెన్, టీమిండియా దిగ్గజం ఎంఎస్ ధోనీ మైదానంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
మోకాలి గాయంతో బాధపడుతున్న ఎంఎస్ ధోనీ జట్టుతో పాటే ప్రయాణిస్తున్న విషయం తెలిసిందే. సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కోసం భాగ్యనగరం కూడా వచ్చాడు. ఉప్పల్ స్టేడియంలో ఆడుతాడనుకున్నా.. అభిమానులకు నిరాశే ఎదురైంది. అయితే ముంబైలోని వాంఖడే స్టేడియంలో మహీ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది. సుమారు అరగంట పాటు వికెట్ కీపింగ్ చేశాడు. మరో అరగంట పాటు బ్యాటింగ్ కూడా చేశాడు. ప్రీ సీజన్లో కాల్ఫ్ స్ట్రెయిన్తో ఇబ్బంది పడిన ధోనీ.. ఇప్పుడు పూర్తి ఫిట్గా కనిపిస్తున్నాడు. అతడు బ్యాటింగ్ చేస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా బంతులను సులభంగా బౌండరీకి పంపడం అభిమానులకు ఊరటనిచ్చింది. ముంబైపై ధోనీ బరిలోకి దిగుతాడని తెలుస్తోంది. మహీ ఆడడంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం సీఎస్కే పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉండటంతో.. ధోనీ రీఎంట్రీ జట్టుకు భారీ బలాన్నిస్తుంది.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
సీఎస్కే జట్టులోకి ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్ చేరాడు. గాయపడిన నాథన్ ఎల్లిస్ స్థానంలో జట్టులోకి వచ్చిన అతడు వాంఖడేలో జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేశాడు. ఇటీవల గాయంతో ఖలీల్ అహ్మద్ కూడా దూరమవడంతో.. జాన్సన్కు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సీఎస్కేకు గాయాల సమస్యలు ఇంకా వెంటాడుతున్నాయి. ఇటీవల మ్యాచ్లో యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే హామ్స్ట్రింగ్ గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో జట్టులో మార్పులు తప్పనిసరి అయ్యాయి.
ముంబై ఇండియన్స్కు కూడా ఓ గుడ్ న్యూస్. ఇంగ్లండ్ స్టార్ విల్ జాక్స్ ఎట్టకేలకు జట్టుతో చేరాడు. ఐపీఎల్ 2026 ప్రారంభంలో కొన్ని మ్యాచ్లకు దూరమైన జాక్స్.. తాజాగా వాంఖడేలో ప్రాక్టీస్ ప్రారంభించాడు. నెట్స్లో బౌలింగ్ చేస్తూ.. గంటకు పైగా బ్యాటింగ్ చేస్తూ తన ఫిట్నెస్ను చూపించాడు. 2026 టీ20 వరల్డ్ కప్లో అద్భుత ప్రదర్శన చేసిన జాక్స్.. ముంబై జట్టుకు కీలక బలం కానున్నాడు. అతడి చేరికతో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు మరింత బలపడనున్నాయి. జాక్స్ జట్టులోకి రావడంతో విదేశీ ఆటగాళ్ల కాంబినేషన్లో మార్పులు రావొచ్చు. అల్లా ఘజన్ఫర్ లేదా మిచెల్ సాంట్నర్లో ఒకరు చోటు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. మిడిల్ ఆర్డర్లో జాక్స్ ఫినిషర్గా కూడా కీలక పాత్ర పోషించగలడు.
తాజావార్తలు
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
OTR: పసుపు నీళ్లు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?