MP Avinash Reddy : కడప ఎంపీ అవినాష్ రెడ్డి నేటి విచారణ వాయిదా.. రేపు రావాలని సీబీఐ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేటి సీబీఐ విచారణ రేపటికి ( మంగళవారం) వాయిదా పడింది. ఈ రోజు ( సోమవారం ) మధ్యాహ్నం అవినాష్ రెడ్డిని విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చినప్పటికీ.. ఆ విచాణను రేపటికి వాయిదా వేసింది. రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఇవాళ్టి విచారణలో భాగంగా హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి అవినాష్ రెడ్డి హాజరయ్యే సమయంలో విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ మేరకు అవినాష్ రెడ్డికి సీబీఐ మరో నోటీసు ఇచ్చింది.
Read Also : Iftar party: గర్భవతి అయిన భార్యతో ఇలా ప్రవర్తిస్తాడా?.. నటి సనాఖాన్ భర్తపై నెటిజన్లు ఆగ్రహం
Also Read
- India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
- Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
- SS Rajamouli: "ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది".. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
- 55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
అయితే ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో నేటి మధ్యాహ్నం ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ ఉన్నందుకే సీబీఐ తన విచారణను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కాగా.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ఆదివారం ఉదయం వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని ఇప్పటికే సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇప్పటికే సీబీఐ అధికారులు పలుసార్లు ఆయన్ను విచారించింది. అయితే దీనిపై సీబీఐ అధికారులు స్పందించారు. విచారణకు వస్తే అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారా?.. అని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. అవసరమైతే అరెస్ట్ చేస్తామని సీబీఐ వెల్లడించింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు లో వాదనలు జరిగాయి. భాస్కర్ రెడ్డి పిటిషన్ పై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది.
Read Also : The Rising Sun In AP : ఏపీలో మండిపోతున్న ఎండలు
దస్తగిరిని సీబీఐ బెదిరించినట్టు, చిత్రహింసలకు గురిచేసినట్టు ఎర్రగంగిరెడ్డి చెప్పాడని అవినాష్ రెడ్డి లాయర్ అన్నారు. దస్తగిరి సీబీఐకి భయపడి భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చాడని లాయర్ పేర్కొన్నాడు. అవినాష్ రెడ్డి సహా నిందితుడు అంటూ ప్రచారం జరుగుతోందని అవాస్తవం అని లాయర్ తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి అసలు హంతకులు ఎవరో తేల్చకుండా.. రాజకీయ కోణంలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను ఇరికించే కుట్ర మాత్రమే జరుగుతుందని ఎంపీ అవినాష్ రెడ్డి లాయర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
-
Ram Charan : RC 17.. ఓ చిన్న కన్ఫ్యూజన్
-
Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
-
SS Rajamouli: “ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది”.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
ట్రెండింగ్
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!