Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం.. తృటిలో బతికి బయటపడ్డారు.. ఊపిరి పీల్చుకున్న బీసీసీఐ!
- గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం
- తృటిలో బతికి బయటపడ్డ జీటీ ప్లేయర్స్
- ఊపిరి పీల్చుకున్న బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Titans Escape Major Scare as Team Bus Catches Fire: ఐపీఎల్ 2026 ఫైనల్లో ఓటమి బాధలో ఉన్న గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్టుకు మరో షాకింగ్ ఘటన ఎదురైంది. ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం జీటీ ప్లేయర్స్ ప్రయాణిస్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది స్పందించడంతో.. ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో బీసీసీఐ ఊపిరి పీల్చుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆదివారం రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం జీటీ జట్టు బస్సు స్టేడియం నుంచి హోటల్కు బయలుదేరింది. ఈ క్రమంలో బస్సులో షార్ట్ సర్క్యూట్ జరగడంతో తొలుత పొగలు వచ్చాయి. వెంటనే అలర్ట్ అయిన ప్లేయర్స్.. బస్సు దిగిపోయారు. ఆ తర్వాత బస్సులో మంటలు రేగాయి.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
కాసేపు రోడ్డుపైనే వేచి ఉన్న గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు.. మరో బస్సులో హోటల్కు వెళ్లిపోయారు. ఈ ఘటన కారణంగా జీటీ ఆటగాళ్లు దాదాపు గంటసేపు రోడ్డుపైనే నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ మంటలు పెద్ద ప్రమాదానికి దారితీయకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఫైనల్ ఓటమితో నిరాశలో ఉన్న జట్టుకు ఈ ఘటన మరింత ఆందోళన కలిగించింది. గుజరాత్ ఇటీవల వరుస ప్రయాణాలతో బిజీ షెడ్యూల్ను ఎదుర్కొంది. మే 27న ధర్మశాల నుంచి ముల్లాన్పూర్కు చేరుకున్న జట్టు.. మే 29న రాజస్థాన్ రాయల్స్తో క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడింది. అనంతరం మే 30న అహ్మదాబాద్కు తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ.. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయాణం ఆలస్యమైంది. దీంతో జట్టు శనివారం సాయంత్రం మాత్రమే అహ్మదాబాద్ చేరుకుంది.
ఫైనల్ అనంతరం మీడియాతో మాట్లాడిన గుజరాత్ టైటాన్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకి.. ఓటమికి అలసటను కారణంగా చూపడానికి తాను ఇష్టపడనని అన్నారు. ‘ఆర్సీబీ అద్భుతంగా ఆడింది. మేము తక్కువ స్కోరుకే పరిమితమయ్యాం. అయినప్పటికీ బౌలర్లు చివరి వరకు పోరాడారు. ఓటమి తర్వాత మేము ఏం తప్పు చేశామో విశ్లేషించుకుంటాం. ప్రత్యర్థి మంచి క్రికెట్ ఆడిందన్న విషయాన్ని అంగీకరించాల్సిందే’ అని చెప్పారు.
తాజావార్తలు
-
London train crash: ఘోర రైలు ప్రమాదం.. ఇద్దరు మృతి, 80 మందికి పైగా గాయాలు
-
Pooja Hegde: పూజా హెగ్డే తగ్గాల్సిందే.. లేదంటే కష్టమే!
-
SSMB29: ‘వారణాసి’ ఓటీటీ డీల్కే వేల కోట్ల ఆఫరా..? రాజమౌళి సినిమా కోసం దిగ్గజ సంస్థల పోటీ!
-
Producer Narsamma: సినిమా తీసి సర్వం కోల్పోయాం.. ‘ప్రభాస్’ గారు మాకు మీరే దిక్కు: మహిళా రైతు నిర్మాత
-
Trump vs Meloni: ‘నాతో ఫోటో కోసం ఆమె బతిమలాడింది’.. మెలోనిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. కట్చేస్తే..
ట్రెండింగ్
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!