MS Dhoni: ఎంఎస్ ధోనీ నాకు తండ్రి లాంటి వారు.. జూనియర్ మలింగ కామెంట్స్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Matheesha Pathirana Says MS Dhoni is playing my father’s role: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలో ఎందరో క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. భారత ప్లేయర్స్ మాత్రమే కాదు.. విదేశీ ఆటగాళ్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. శ్రీలంక బౌలర్, జూనియర్ మలింగ మతీశా పతిరన అందులో ఒకడు. 2022లో అనూహ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చిన పతిరన.. 2023లో 12 మ్యాచ్లలో 19 వికెట్లు పడగొట్టాడు. ఇక 2024లో సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం సీఎస్కే ప్రధాన పేసర్లలో ఒకడిగా ఎదిగాడు. పతిరన ఎదుగుదలకు కారణం ధోనీనే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తడబడిన ప్రతిసారి మహీ అతడికి అండగా నిలిచాడు.
తాజాగా సీఎస్కే ‘లయన్స్ అప్క్లోజ్’ చాట్లో మతీశా పతిరన మాట్లాడుతూ ఎంఎస్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు. మహీ అందించిన ప్రోత్సాహం ఎప్పటికీ మరువనని, ధోనీ తనకు తండ్రి లాంటి వారని పేర్కొన్నాడు. ‘నా క్రికెట్ జీవితంలో నా తండ్రి తర్వాత ఆ పాత్రను పోషిస్తున్న వ్యక్తి ధోనీ. ఎప్పుడూ నా గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు నడిపిస్తున్నాడు. నేను ఇంటి వద్ద ఉన్నప్పుడు మా నాన్న ఎలా అయితే నాతో ఉంటారో.. ఇక్కడ ధోనీ అలా ఉంటారు. మైదానంలో కానీ లేదా బయట కానీ అది చెయ్ ఇది చెయ్ అని చెప్పరు. అవసరమైన విషయాలను మాత్రమే చెబుతారు. ఆ మాటలు వినేందుకు చాలా చిన్నవిగా అనిపించినప్పటికీ.. ప్రతీ మ్యాచ్లోనూ నా విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎప్పుడు ఏ అనుమానం ఉన్నా.. ధోనీని అడుగుతా. ఆయన సమాధానం చెబుతారు’ అని పతిరన చెప్పాడు.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
Aslo Read: OnePlus 12 Price Drop: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. వన్ప్లస్ 12పై భారీ తగ్గింపు!
ఐపీఎల్ 2024లో మతీశా పతిరన 6 మ్యాచుల్లో 13 వికెట్లు పడగొట్టాడు. జూనియర్ మలింగ ఇప్పటివరకు ఐపీఎల్లో 20 మ్యాచ్లలో 34 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ బౌలింగ్ యాక్షన్ను పతిరన అచ్చు దింపుతాడు. యార్కర్లతో మేటి బ్యాటర్లను సైతం బోల్తా కొట్టిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 వీసా కోసం స్వదేశం వెళ్లిన పతిరన.. త్వరలోనే జట్టుతో కలవనున్నాడు.
తాజావార్తలు
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్లైన్.. భారత్కు పెరిగిన కష్టాలు!
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్కు డబుల్ ధమాకా.. అఫ్గాన్తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!