IPL 2025: క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్.. త్వరలో ఐపీఎల్ రీస్టార్ట్.. కొత్త షెడ్యూల్!
- భారత్- పాక్ మధ్య యుద్ధంతో ఆగిపోయిన ఐపీఎల్..
- త్వరలోనే ఐపీఎల్ రీస్టార్ట్ చేస్తామని ప్రకటించిన బీసీసీఐ..
- ఐపీఎల్ కొనసాగింపుపై నేడు ప్రత్యేక భేటీ నిర్వహించనున్న బీసీసీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025: భారత్- పాక్ మధ్య యుద్ధంతో ఐపీఎల్కు తాత్కాలిక బ్రేక్ పడింది. అయితే, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో వీలైనంత తొందరగా మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లను ముగించాలని గవర్నింగ్ కౌన్సిల్ ఆలోచనలో ఉంది. ఈ వారాంతంలో టోర్నమెంట్ మళ్లీ స్టార్ట్ కావొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే మే 15వ తేదీ నుంచే మ్యాచ్లు జరిగే ఛాన్స్ ఉంది. అసలు షెడ్యూల్ ప్రకారం మే 25లోపే లీగ్ను ముగించాలని బీసీసీఐ పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. ఇక, ఐపీఎల్ కొనసాగింపుపై నేడు ప్రత్యేక భేటీ నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలియజేశారు.
Read Also: Trisha : త్రిషకు అద్భుతంగా ప్రపోజ్ చేసిన అభిమాని..
Also Read
- Arshdeep Singh: అర్ష్దీప్ సింగ్కు షాకిచ్చిన బీసీసీఐ..! ఇక, కుదరదు..
- IPL 2026-BCCI: ఐపీఎల్లో సంచలనం.. క్రికెటర్ గర్ల్ఫ్రెండ్పై అనుమానాలు.. సమాచార లీక్పై బీసీసీఐ సీరియస్!
- RCB IPL 2026 Playoffs: ఆర్సీబీకి భారీ షాక్.. ప్లేఆఫ్స్ రేసులో కొత్త టెన్షన్!
- IPL 2026 Final: చిన్నస్వామి నుంచి ఐపీఎల్ ఫైనల్ తరలింపు.. షాకింగ్ విషయం చెప్పిన బీసీసీఐ!
ఇక, ఐపీఎల్–2025 లీగ్ దశలో మొత్తం 57 మ్యాచ్లు కంప్లీట్ అయ్యాయి. ధర్మశాల వేదికగా పంజాబ్, ఢిల్లీ మధ్య జరుగుతున్న 58వ మ్యాచ్ను అర్ధాంతరంగా నిలిపివేసింది.. దీంతో ఈ మ్యాచ్ ను మళ్లీ నిర్వహించాలా లేదంటే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించాలా అనే దానిపై గవర్నింగ్ కౌన్సిల్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. లీగ్ దశలో మరో 12 మ్యాచ్లతో పాటు 4 ప్లే ఆఫ్స్ కలిపి మొత్తం 16 మ్యాచ్లు జరగాల్సి ఉంది. ముందు అనుకున్నట్లుగానే.. దక్షిణాదిలో సురక్షితమైన స్టేడియాల్లో మ్యాచ్లు జరపాలని బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది. దీని కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలను సెలక్ట్ చేశారు.
అయితే, షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్లో ఎలాగూ రెండు ప్లే ఆఫ్స్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంటుంది. వీటీతో పాటు ఈ మూడు స్టేడియాల్లో మిగతా మ్యాచ్ లు జరిగే అవకాశం పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఇప్పటికే స్వదేశాలకు వెళ్లిపోయిన విదేశీ ఆటగాళ్లను తిరిగి భారత్ కు రప్పించడానికి ఐపీఎల్ ఫ్రాంచైజీలు, నిర్వాహకులకు పెద్ద సమస్యగా మారింది. కాగా, ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు తమ జట్లకు చెందిన ప్లేయర్స్ ను, ఇతర సిబ్బందిని వెనక్కి వచ్చే ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సమాచారం అందజేసింది.
తాజావార్తలు
-
Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్కు లైన్క్లియర్.. రేపే ప్రమాణస్వీకారం
-
DC vs KKR: టాస్ గెలిచిన కేకేఆర్.. ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్!
-
Hantavirus: వెలుగులోకి హంటావైరస్ కేసులు.. భారత్లో వైద్య నిపుణుల కీలక సూచనలు..
-
Tamil Nadu: అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వాలని డీఎంకే చెప్పింది.. లెఫ్ట్ పార్టీల సంచలన వ్యాఖ్యలు..
-
Britannia Biscuit: బిస్కెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న బ్రిటానియా ధరలు, తగ్గనున్న బిస్కెట్లు!