IPL 2025: క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్.. త్వరలో ఐపీఎల్ రీస్టార్ట్.. కొత్త షెడ్యూల్!
- భారత్- పాక్ మధ్య యుద్ధంతో ఆగిపోయిన ఐపీఎల్..
- త్వరలోనే ఐపీఎల్ రీస్టార్ట్ చేస్తామని ప్రకటించిన బీసీసీఐ..
- ఐపీఎల్ కొనసాగింపుపై నేడు ప్రత్యేక భేటీ నిర్వహించనున్న బీసీసీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025: భారత్- పాక్ మధ్య యుద్ధంతో ఐపీఎల్కు తాత్కాలిక బ్రేక్ పడింది. అయితే, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో వీలైనంత తొందరగా మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లను ముగించాలని గవర్నింగ్ కౌన్సిల్ ఆలోచనలో ఉంది. ఈ వారాంతంలో టోర్నమెంట్ మళ్లీ స్టార్ట్ కావొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే మే 15వ తేదీ నుంచే మ్యాచ్లు జరిగే ఛాన్స్ ఉంది. అసలు షెడ్యూల్ ప్రకారం మే 25లోపే లీగ్ను ముగించాలని బీసీసీఐ పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. ఇక, ఐపీఎల్ కొనసాగింపుపై నేడు ప్రత్యేక భేటీ నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలియజేశారు.
Read Also: Trisha : త్రిషకు అద్భుతంగా ప్రపోజ్ చేసిన అభిమాని..
Also Read
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
- IPL 2026 Playoff Tickets: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇక్కడ బుక్ చేసుకోండిలా..
- CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
- IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
ఇక, ఐపీఎల్–2025 లీగ్ దశలో మొత్తం 57 మ్యాచ్లు కంప్లీట్ అయ్యాయి. ధర్మశాల వేదికగా పంజాబ్, ఢిల్లీ మధ్య జరుగుతున్న 58వ మ్యాచ్ను అర్ధాంతరంగా నిలిపివేసింది.. దీంతో ఈ మ్యాచ్ ను మళ్లీ నిర్వహించాలా లేదంటే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించాలా అనే దానిపై గవర్నింగ్ కౌన్సిల్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. లీగ్ దశలో మరో 12 మ్యాచ్లతో పాటు 4 ప్లే ఆఫ్స్ కలిపి మొత్తం 16 మ్యాచ్లు జరగాల్సి ఉంది. ముందు అనుకున్నట్లుగానే.. దక్షిణాదిలో సురక్షితమైన స్టేడియాల్లో మ్యాచ్లు జరపాలని బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది. దీని కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలను సెలక్ట్ చేశారు.
అయితే, షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్లో ఎలాగూ రెండు ప్లే ఆఫ్స్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంటుంది. వీటీతో పాటు ఈ మూడు స్టేడియాల్లో మిగతా మ్యాచ్ లు జరిగే అవకాశం పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఇప్పటికే స్వదేశాలకు వెళ్లిపోయిన విదేశీ ఆటగాళ్లను తిరిగి భారత్ కు రప్పించడానికి ఐపీఎల్ ఫ్రాంచైజీలు, నిర్వాహకులకు పెద్ద సమస్యగా మారింది. కాగా, ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు తమ జట్లకు చెందిన ప్లేయర్స్ ను, ఇతర సిబ్బందిని వెనక్కి వచ్చే ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సమాచారం అందజేసింది.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!