BCCI on Impact Rule in IPL 2024: ఐపీఎల్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ను బీసీసీఐ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మ్యాచ్ జరుగుతుండగా అదనంగా బౌలర్ లేదా బ్యాటర్ను తీసుకొనే వెసులుబాటును కలిగింది. ఈ రూల్పై కొందరి నుంచి వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంపాక్ట్ రూల్పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంపాక్ట్ రూల్ తనను ఆకట్టుకోలేదని, దీంతో ఆల్రౌండర్ల అభివృద్ధికి అడ్డంకిగా మారిందన్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ మేనేజ్మెంట్ ఈ రూల్పై దృష్టి సారించింది.
Also Read: Thalapathy Vijay: స్టార్ హీరో విజయ్పై కేసు నమోదు!
ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఇంపాక్ట్ రూల్పై మాట్లాడుతూ… ‘టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన కామెంట్లను గమనించాం. తప్పకుండా ఇంపాక్ట్ రూల్పై దృష్టిసారిస్తాం. ఫ్రాంచైజీలు, కమిటీ సభ్యులతో చర్చించి.. ఓ నిర్ణయానికి వస్తాం. ఇంపాక్ట్ రూల్లో మార్పులు చేసేందుకు మేము సిద్ధమే. అయితే ఆటలో కొత్త నిబంధన తీసుకొచ్చినప్పుడు లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి’ అని అన్నాడు. 2022-23 సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా ఇంపాక్ట్ రూల్ను అమలు చేసిన బీసీసీఐ.. ఆ తర్వాత ఐపీఎల్లో అమలు చేస్తున్నారు. గత సీజన్తో పోలిస్తే.. ఈ సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను అన్ని జట్లు బాగా ఉపయోగిస్తున్నాయి.