Tejasvi Singh-IPL 2026: కేకేఆర్కు కొత్త యువ వికెట్ కీపర్.. ఎవరీ తేజస్వి సింగ్!
- ఎవరీ తేజస్వి సింగ్ దహియా
- బేస్ ధరకు 10 రెట్లు ఎక్కువ పెట్టిన కేకేఆర్
- కేకేఆర్కు కొత్త యువ వికెట్ కీపర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్కు మినీ వేలంలో యువ భారత ఆటగాడిని కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టులోకి చేర్చుకుంది. అబుదాబిలో జరుగుతున్న వేలంలో ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ తేజస్వి సింగ్ దహియాను రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. తేజస్వి వేలంలో తన పేరును రూ.30 లక్షల కనీస ధరతో నమోదు చేయగా.. అతడిపై కేకేఆర్ నమ్మకం ఉంచి భారీగా వెచ్చించింది. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీకి వచ్చినా.. కోల్కతా వెనక్కి తగ్గకుండా బిడ్ వేసి తేజస్విని సొంతం చేసుకుంది.
తేజస్వి సింగ్ ఇప్పటివరకు 6 టీ20 మ్యాచ్లు మాత్రమే ఆడినా.. తన దూకుడైన బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. టీ20ల్లో 113 పరుగులు చేసిన తేజస్వి స్ట్రైక్రేట్ 168.65గా ఉంది. టీ20ల్లో అతడి సగటు 56.50గా ఉండటం విశేషం. ఇప్పటివరకు 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాదిన ఈ యువ ఆటగాడు గొప్ప ఫినిషర్గా మారతాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. వికెట్ కీపింగ్తో పాటు పవర్ హిట్టింగ్ చేయగల ఆటగాడిగా తేజస్వి పేరు తెచ్చుకుంటున్నాడు. యువతకు అవకాశాలు ఇవ్వడంలో మంచి పేరున్న కేకేఆర్.. ఈసారి కూడా తేజస్వి సింగ్ దహియాను కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2026లో తేజస్వి తన ప్రతిభను ఎంతవరకు నిరూపించుకుంటాడో, కేకేఆర్కు అతడు ఎంతవరకు ఉపయోగపడతాడో చూడాలి.
Also Read
- Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీ చెలరేగుతాడా?.. షమీ, పృథ్వీ, సర్ఫరాజ్లకు కీలక పరీక్ష..
- Gautam Gambhir: సారాంశ్ జైన్కు ఛాన్స్..? కుల్దీప్ యాదవ్పై గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్
- Gautam Gambhir: లైక్స్, వ్యూస్ కాదు.. ట్రోఫీలే ముఖ్యం.. విమర్శకులకు గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్
- AUS vs BAN: కన్నెర్ర చేసిన మిచెల్ స్టార్క్.. 64 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్..!
ఐపీఎల్ 2026 వేలంలో కేకేఆర్ కొనుగోలు చేసిన నాలుగో ఆటగాడు తేజస్వి సింగ్. అతడికంటే ముందే కేకేఆర్ భారీ సంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ను రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసి.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిపింది. ఆ తర్వాత న్యూజిలాండ్ వికెట్కీపర్ బ్యాటర్ ఫిన్ అలెన్ను రూ.2 కోట్లకు, శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీశా పతిరనను రూ.18 కోట్లకు దక్కించుకుంది.
కేకేఆర్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
కామెరూన్ గ్రీన్ (ఆస్ట్రేలియా) – రూ.25.20 కోట్లు
ఫిన్ అలెన్ (న్యూజిలాండ్) – రూ.2 కోట్లు
మతీశా పతిరన (శ్రీలంక) – రూ.18 కోట్లు
తేజస్వి సింగ్ దహియా (భారత్) – రూ.3 కోట్లు
తాజావార్తలు
-
CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
-
Karnataka: ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ అదృశ్యం.. పోలీసుల గాలింపు
-
Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
-
Cheque Book New Rules 2026: చెక్బుక్ కొత్త రూల్స్.. మీ చెక్పై ఈ సెక్యూరిటీ కోడ్ ఉందా? చెక్ చేసుకోండి!
-
Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!