ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంలో దేశవాళీ ఆటగాడు ప్రశాంత్ వీర్పై కాసుల వర్షం కురిసింది. ఉత్తర్ప్రదేశ్కు చెందిన అన్క్యాప్డ్ ప్లేయర్ ప్రశాంత్ కనీస ధర రూ.30 లక్షలు కాగా.. రూ.14.20 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సొంతం చేసుకుంది. 20 ఏళ్ల ప్రశాంత్ కోసం సీఎస్కేతో పాటు సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) పోటీ పడ్డాయి. ప్రశాంత్ కోసం ముందుగా ముంబై ఇండియన్స్ బిడ్ వేయగా.. ఆపై లక్నో సూపర్ జెయింట్స్ పోటీ…