IND-W vs ENG-W: హర్మన్ వీరవిహారం.. 23 ఏళ్ల తర్వాత భారత్ రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Woman Team Won Series In Englang After 23 Years: ఇంగ్లండ్ గడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు సంచలనం నమోదు చేసింది. 23 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై వన్డే సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించంది. సెంచరీతో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, బౌలింగ్లో రేణుకా సింగ్ రాణించడంతో.. రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో, ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో ఈ సిరీస్ కైవసం చేసుకుంది భారత్.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 333 పరుగులు చేసింది. ఆరంభంలోనే షెఫాలీ వర్మ (8) ఔటైనా.. మరో ఓపెనర్ స్మృతి మందాన (40), యస్తికా (26) కొంతవరకు రాణించారు. వెంటనే వికెట్ పడనివ్వకుండా, క్రీజులో కాసేపు కుదురుకున్నారు. ఇక ఆ తర్వాత వచ్చిన హర్మన్ ప్రీత్ కౌర్ వీరవిహారం చేసింది. 111 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 143 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది. ఈ క్రమంలో ఆమె తొలుత హర్లీన్ డియోల్(58)తో కలిసి నాలుగో వికెట్కి 113 పరుగులు, ఆ తర్వాత వస్త్రాకర్(16)తో కలిసి ఐదో వికెట్కి 50 పరుగులు, దీప్తి శర్మ(15)తో ఆరో వికెట్కు 70 పరుగుల భాగస్వామ్యాల్ని నెలకొల్పింది. దీంతో భారత మహిళల జట్టు 333/5 పరుగులు చేసింది. వన్డేల్లో భారత్కి ఇది రెండో అత్యధిక స్కోరు.
Also Read
- India vs Sri Lanka Test: మానవ్ సుతార్ సంచలనం.. అశ్విన్, హర్భజన్ రికార్డులు బద్దలు..!
- Babar Azam: ఇంగ్లండ్తో తొలి టెస్టుకు బాబర్ ఆజమ్ ఎందుకు దూరమయ్యాడు? అసలు కారణం ఇదే
- Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
- WTC Points Table 2026: శ్రీలంకపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో టీమిండియాకు భారీ లాభం!
అనంతరం 334 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు.. ఆది నుంచే తడబడింది. ప్రత్యర్థి జట్టులోని ప్లేయర్స్ ఎవ్వరూ తమ సత్తా చాటలేకపోయారు. ఒక్క డానీ బ్యాట్ మాత్రమే 65 పరుగులతో అత్యధిక స్కోరర్గా నిలిచింది. మిగిలిన వాళ్లంతా అంతంత మాత్రమే రాణించారు. దీంతో.. 42.2 ఓవర్లలో ఇంగ్లండ్ 245 పరుగులకే ఆలౌటూంది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ నాలుగు, డి. హేమలత రెండు వికెట్లతో ఇంగ్లండ్ ప్లేయర్స్కి చుక్కలు చూపించారు. సెంచరీతో తాండవం చేయడంతో హర్మన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!