Ind Vs Zim: నేడు రెండో వన్డే.. రిస్క్ చేసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్కు వస్తాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind Vs Zim: జింబాబ్వే గడ్డపై ఆ దేశ జట్టుతో టీమిండియా నేడు రెండో వన్డే ఆడనుంది. మూడు వన్డేల సిరీస్లో ఇప్పటికే టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో సునాయాసంగా విజయం సాధించింది. రెండో వన్డేలోనూ టీమిండియా ఫేవరేట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్కు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమైన నేపథ్యంలో ఈ వన్డేలో అతడు ఓపెనింగ్కు వస్తాడా లేదా మిడిలార్డర్లోనే వస్తాడా అన్న విషయం ఉత్కంఠ రేపుతోంది. ఆసియాకప్కు ముందు అతడు ఫామ్లోకి రావాలని జట్టు కోరుకుంటోంది. అటు ఆడుతోంది పసికూన జింబాబ్వేతో అయినా టీమిండియా రక్షణాత్మక ధోరణి అవలంభిస్తుండటం అభిమానులకు నచ్చడం లేదు. తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోకుండా కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకోవడమేంటని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Read Also: Boycott Amazon: శ్రీకృష్ణుడిని అవమానించిన అమెజాన్.. బాయ్కాట్ చేయాలంటూ డిమాండ్
Also Read
- Tim David: నీకు ఫైన్ వేయడంలో ఏమాత్రం తప్పు లేదయ్యా.. గ్రౌండ్ లోనే సిగార్ తాగుతూ రచ్చ రచ్చ.!
- Vaibhav Sooryavanshi-Kohli: సెల్ఫిష్ అంటూ విరాట్ కోహ్లీని తిట్టిన వైభవ్ సూర్యవంశీ.. అసలు విషయం ఏంటంటే?
- Viral News: 3 రోజుల్లో ఒంటరిగా 6000కిలోమీటర్ల ప్రయాణం.. RCB కోసం మహిళా ఫ్యాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
- IND vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా సవాల్.. 2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు.. న్యూజిలాండ్ టూర్ పూర్తి షెడ్యూల్ విడుదల.!
ఇటీవల బంగ్లాదేశ్తో ప్రదర్శన చూశాక జింబాబ్వే టీమిండియాకు కనీస పోటీ ఇస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావించారు. కానీ తొలి వన్డేలో 110 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి 150 పరుగులైనా జింబాబ్వే చేస్తుందా అని చాలా మంది సందేహించారు. అయితే టెయిలెండర్ల ప్రతిభ కారణంగా 190 పరుగుల టార్గెట్ను జింబాబ్వే నిర్దేశించింది. ఈ టార్గెట్ను భారత్ వికెట్ కోల్పోకుండా ఛేదించినా మరీ నెమ్మదిగా ఆడారంటూ ధావన్-గిల్ విమర్శలను ఎదుర్కొన్నారు. జింబాబ్వే లాంటి జట్టుపైనా రిస్క్ చేసి ఆడకపోతే టీమిండియా ఎందుకంటూ పలువురు సెటైర్లు వేస్తున్నారు. ఈ మధ్య టీమ్ అప్రోచ్ మారిందని, దూకుడే మంత్రంగా జట్టు ముందుకు సాగుతుందని టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ పదే పదే చెప్పారు. కానీ జింబాబ్వేతో తొలి వన్డేలో అలాంటి సీన్ కనిపించలేదు. అటు ఏ మాత్రం పసలేకుండా సాగిన తొలి వన్డే మ్యాచ్ అభిమానులకు తీవ్ర బోర్ కొట్టించింది. కాగా ఇవాళ్టి మ్యాచ్ మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రారంభం అవుతుంది. తొలి వన్డేలో దిగిన జట్టుతోనే భారత్ బరిలోకి దిగనుంది.
తాజావార్తలు
-
Ntv Exclusive: ‘పెద్ది’తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
-
Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం.. లక్షల కోట్లు గాల్లోనే!
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
-
PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!